logo

భాజపా ఓడితేనే అన్ని వర్గాలకు న్యాయం

దేశంలో అన్నివర్గాలకు న్యాయం జరగాలన్నా, ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా.. భాజపా ఓడిపోవాల్సిందేనని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు.

Published : 07 May 2024 03:33 IST

తెజస రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం

సంగారెడ్డిలో మాట్లాడుతున్న కోదండరాం, పక్కన నాయకులు

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: దేశంలో అన్నివర్గాలకు న్యాయం జరగాలన్నా, ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా.. భాజపా ఓడిపోవాల్సిందేనని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. భాజపా పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. కేంద్రం ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. జీఎస్టీతో చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయని, కార్మికులకు ఉపాధి కరవైందన్నారు. అందుకే తాము లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు, జహీరాబాద్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.  ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సమావేశంలో తెజస జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశప్ప, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని