అత్యవసరమైతేనే బయటకు రండి
జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వడగాలులు వీస్తున్నాయి. పిల్లలు, పెద్దలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. నిత్యం సగటున 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
జిల్లా ఇన్ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవితో ‘న్యూస్టుడే’
సంగారెడ్డి అర్బన్, న్యూస్టుడే
జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వడగాలులు వీస్తున్నాయి. పిల్లలు, పెద్దలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. నిత్యం సగటున 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవితో ‘న్యూస్టుడే’ ముఖాముఖి నిర్వహించింది. ఆమె వెల్లడించిన వివరాలు..
వైద్యారోగ్యశాఖ అప్రమత్తం
జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు, సిబ్బందికి అత్యవసరమైతే మినహా సెలవులు లేవు. ఎన్నికల విధులు నిర్వహిస్తూనే మరోవైపు ప్రజలకు ఎండల తీవ్రత కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను నియమించాం. సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, జహీరాబాద్ ఉప వైద్యాధికారులు, డివిజన్ స్థాయి, ఆరోగ్య, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య బృందాలు ఏర్పాటు చేశాం. వీరిని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో నలుగురు అధికారులను నియమించాం. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ప్రజలు 94948 51165, డయల్ 100, 108కి ఫోన్చేసి సహాయం పొందొచ్చు.
మందుల కొరత లేదు
ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అన్ని రకాల మందులు సరిపడా ఉన్నాయి. ఇప్పటికే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా ఎండల వల్ల కలిగే నష్టాలపై పల్లెలు, పట్టణాల్లో ఇంటింటా అవగాహన కల్పించాం. ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికులు, ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రస్తుతం రెండు లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి మజ్జిగ, పళ్ల రసాలు, కొబ్బరి బొండాలు తీసుకోవాలి. నిల్వ చేసిన ఆహార పదార్థాలు, వేపుడు పదార్థాలు తినవద్దు. తలనొప్పి, జ్వరం తదితర అనారోగ్య సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి.
ప్రయాణాలు తగ్గిస్తే మేలు
ఎండలో ప్రయాణించడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ బారినపడే అవకాశం ఉంటుంది. ప్రజలకు తప్పనిసరైతేనే ఎండలో బయటకు రావాలి.. ప్రయాణాలు తగ్గించాలి. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, రైతులు పనులకు వెళ్లినప్పుడు తలకు రుమాలు కట్టుకోవాలి. లేదంటే టోపీ ధరించాలి. మధ్యాహ్నం తర్వాత కూడా ఎండలో పనిచేస్తే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారు ఆభరణాలు చోరీ
[ 18-05-2024]
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో బంగారం చోరీకి గురైంది. బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగు లోంచి 8 తులాల బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. -
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే