అధినేత యాత్రపై ఆశలు
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. సిట్టింగ్ స్థానమైన మెదక్ లోక్సభ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు,
మెదక్లో నేడు భారాస అధ్యక్షుడు కేసీఆర్ రోడ్షో
మెదక్, నర్సాపూర్: సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. సిట్టింగ్ స్థానమైన మెదక్ లోక్సభ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు, పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పాటు మెతుకుసీమలో పర్యటించనున్నారు. అధినేత పర్యటన కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
మెదక్ లోక్సభ నియోజకవర్గంలో 2004 నుంచి భారాస పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. సొంత జిల్లా కావడంతో కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వరుసగా ఐదుసార్లు (ఉప ఎన్నికతో) కలిపి ఈ స్థానాన్ని భారాస తన ఖాతాలో వేసుకుంది. ఆరోసారి ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లలో ఆరుగురు భారాస ఎమ్మెల్యేలుండడం, ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేట జిల్లాలో పట్టువుండడం కలిసివస్తోందని భారాసభావిస్తోంది. ఈక్రమంలో శ్రేణుల్లో జోష్ నింపేందుకు అగ్రనేత పర్యటిస్తున్నారు.
పర్యటన ఇలా...: కేసీఆర్ మంగళవారం సాయంత్రం కామారెడ్డిలో రోడ్డుషో ముగించుకొని రామాయంపేట మీదుగా రాత్రి 7 గంటలకు మెదక్కు చేరుకుంటారు. స్థానిక ర.భ. అతిథిగృహం నుంచి పార్టీ శ్రేణులు ర్యాలీగా బయల్దేరి రాందాస్ చౌరస్తా వద్దకు చేరుకుంటారు. అక్కడే ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. రాత్రి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి, మరుసటి రోజు బుధవారం సాయంత్రం నర్సాపూర్లోని అంబేడ్కర్ కూడలి వద్ద జరిగే కార్నర్ మీటింగ్లో ప్రసంగించనున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగే రోడ్షోలో పాల్గొంటారు. 10న సిద్దిపేటలో జరిగే రోడ్డుషోలో కేసీఆర్ పాల్గొనన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారు ఆభరణాలు చోరీ
[ 18-05-2024]
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో బంగారం చోరీకి గురైంది. బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగు లోంచి 8 తులాల బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. -
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే