హామీల అమలులో మాట తప్పిన సీఎం
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాట తప్పారని, మాట తప్పిన ముఖ్యమంత్రికి ఓటు ద్వారానే ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు.
ములుగులో మాట్లాడుతున్న హరీశ్రావు, చిత్రంలో ప్రతాప్రెడ్డి , వెంకట్రామిరెడ్డి
నర్సాపూర్, న్యూస్టుడే: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాట తప్పారని, మాట తప్పిన ముఖ్యమంత్రికి ఓటు ద్వారానే ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. నర్సాపూర్లో బుధవారం మాజీ సీఎం కేసీఆర్ రోడ్షో విజయవంతం చేసేందుకు, పట్టణంలోని ఓ వేడుక మందిరంలో ముఖ్యనేతలతో సోమవారం ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయని ఎద్దేవా చేశారు. పుట్టినగడ్డ మెదక్ నుంచి కేసీఆర్ తెలంగాణ ప్రతేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపి సాధించారని, ఈ జిల్లా అబివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, ఆయన్ని అవమానిస్తూ మాట్లాడుతున్న వారికి మెదక్ జిల్లా ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కలను భారాస సాకారం చేస్తే, కాంగ్రెస్ వాటిని రద్దుచేస్తామని అంటోంది, జిల్లాలు వద్దనుకునే వారు కాంగ్రెస్కు ఓటేయాలన్నారు, కావాలని కోరుకునేవారు భారాసను గెలిపించాలన్నారు. పదేళ్ల పాలనలో భాజపా ఏం చేశామనేది చెప్పడం లేదు, ఐదు నెలల పాలనలో కాంగ్రెస్ కూడా చేసింది చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు అబద్ధాలతో పుట్టిన కవలపిల్లలు. ప్రజలకిచ్చిన హామీలపైన చర్చ పెట్టకుండా, మతం పేరుతో ఒకరు, రిజర్వేషన్ల పేరుతో మరొకరు సెంటిమెంట్తో లబ్ధి పొందేందుకు చూస్తున్నాయని ఆరోపించారు. సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర నాయకులు గోపి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పుర అధ్యక్షులు అశోక్గౌడ్, బోగశేఖర్ పాల్గొన్నారు.
ములుగు: కాంగ్రెస్ పార్టీతో ప్రమాదం పొంచి ఉందని హరీశ్రావు అన్నారు. వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ములుగులో కార్నర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తేసిందన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కావడం లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారు ఆభరణాలు చోరీ
[ 18-05-2024]
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో బంగారం చోరీకి గురైంది. బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగు లోంచి 8 తులాల బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. -
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే