logo

‘గౌరవెల్లి’ నీరందించడమే అత్యంత ప్రాధాన్యం

గౌరవెల్లి రిజర్వాయరు ద్వారా సాగునీరందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.

Published : 08 May 2024 02:33 IST

హుస్నాబాద్‌లో ఉదయపు నడకలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రచారం
హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: గౌరవెల్లి రిజర్వాయరు ద్వారా సాగునీరందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యంగా చేపడుతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం హుస్నాబాద్‌లో భీమదేవరపల్లి, సైదాపూర్‌, ఎల్కతుర్తి మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, బూత్‌ ఇన్‌ఛార్జులు, గ్రామశాఖల అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులతో మండలాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బస్సు సౌకర్యం లేని గ్రామాలకు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌గౌడ్‌, ఆయా మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. హుస్నాబాద్‌ పట్టణంలో ఉదయపు నడకలో ఓటర్లను కలుస్తూ వి.రాజేందర్‌రావును గెలిపించాలని కోరారు. దారిలో చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, వాకర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు