పోలీసులు, ఎమ్మెల్యే పేర్లతో వసూళ్లు
పోలీసులు, ఎమ్మెల్యే పేరు చెప్పి.. సీఎం రేవంత్రెడ్డి తమ్ముడితో సంబంధాలు ఉన్నాయంటూ ఇసుక, ఇతర వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండు చేస్తూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్న నిందితుడిని మంగళవారం మెదక్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
నిందితుడి రిమాండు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ దిలీప్కుమార్
మెదక్, న్యూస్టుడే: పోలీసులు, ఎమ్మెల్యే పేరు చెప్పి.. సీఎం రేవంత్రెడ్డి తమ్ముడితో సంబంధాలు ఉన్నాయంటూ ఇసుక, ఇతర వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండు చేస్తూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్న నిందితుడిని మంగళవారం మెదక్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ సీఐ దిలీప్కుమార్ తెలిపిన వివరాలు.. స్థానిక ఇందిరపురికాలనీకి చెందిన ఆముదా రఘు పోలీసుల పేరు చెప్పి మెదక్లో ఇసుక, ఇతర వ్యాపారులను బెదిరిస్తున్నాడు. చేతిలో లాఠీ పట్టుకొని వారిని వెంబడించడమే కాకుండా దౌర్జన్యం చేస్తున్నాడు. పోలీసులు, ఎమ్మెల్యే పేర్లు చెప్పి.. సీఎం రేవంత్రెడ్డి తమ్ముడితో సత్సంబధాలు ఉన్నాయంటూ ఉన్నతాధికారుల నంబర్లను సేకరించాడు. సొంతంగా వాట్సప్ సమూహం ఏర్పాటు చేశాడు. ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ వారికి ఫోన్ చేస్తున్నట్టు నటిస్తూ వ్యాపారుల నుంచి డబ్బులు దోపిడీ చేస్తున్నాడు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లి అక్కడి వారిపై అజమాయిషీ చేస్తూ డబ్బులు డిమాండ్ చేసేవాడు. మాట వినని అధికారులపై ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడు. పోలీసుల పేర్లు చెబుతూ, పోలీసుగా నటిస్తూ అమాయకులైన వారిని బెదిరించి దౌర్జన్యంగా డబ్బులు డిమాండు చేస్తున్న రఘును మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఇతడిపై హైదరాబాద్అఫ్జల్గంజ్లో అత్యాచారం, మెదక్ పట్టణంలో ఏడు కేసులు, హవేలిఘనపూర్ ఠాణాలో ఒక దోపిడీ కేసు నమోదైందని సీఐ వివరించారు.
పంక్చరైన టైరు.. వంతెన గోడను ఢీకొన్న వ్యాను
వృద్ధుడి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
జోగిపేట: వ్యాను టైరు పంక్చరై అదుపు తప్పి వంతెన గోడను ఢీకొనడంతో వృద్ధుడు మృతిచెందగా.. ముగ్గురికి గాయాలైన ఘటన అందోలు మండల పరిధిలో జరిగింది. జోగిపేట ఎస్సై అరుణ్కుమార్ తెలిపిన వివరాలు.. పెద్దశంకరంపేటకు చెందిన సంగయ్యగౌడ్(60).. ఆయన భార్య అంజమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మంగళవారం ఉదయం వ్యాన్లో కుమార్తెలు మంజుల, మానస, కుమారుడు అరవింద్గౌడ్తో పాటు మరొకరితో కలిసి సంగారెడ్డికి బయలుదేరారు. అందోలు మండలం అల్మాయిపేట, చౌటకూరు మధ్య వంతెన వద్దకు రాగానే వ్యాన్ ముందు టైరు పంక్చరైంది. దీంతో అదుపు తప్పి వంతెన గోడను బలంగా ఢీకొనడంతో సంగయ్యగౌడ్, అంజమ్మ, మంజుల, మానస, అరవింద్గౌడ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారి వెంట ఉన్న మరొకరికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. సంగయ్యగౌడ్ మార్గమధ్యలోనే మృతిచెందాడు. క్షతగాత్రులను మెరుగైన చికిత్సకు హైదరాబాద్ తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.
నిలిపిన ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ద్విచక్ర వాహనదారుడు..
హత్నూర, న్యూస్టుడే: రోడ్డు మీద నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని వెనుక ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. హత్నూర మండలం గోవింద్రాజ్పల్లి శివారులో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సుభాష్ తెలిపిన వివరాలు.. హత్నూర మండలం నవాబుపేటకు చెందిన డప్పు వెంకట్(21), గోవింద్రాజ్పల్లికి చెందిన సుమన్, నర్సింహులు స్నేహితులు. సోమవారం సుమన్ పుట్టిన రోజు కావడంతో ముగ్గురు స్నేహితులు దౌల్తాబాద్లో ఫ్లెక్సీ సిద్ధం చేసుకొని ద్విచక్ర వాహనంపైన తిరిగి వస్తూ గోవింద్రాజ్పల్లిలో నిలిపి ఉంచిన ట్రాక్టర్ను ఢీకొన్నారు. వెంకట్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సుమన్, నర్సింహులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో సుమన్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతుడి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
మనోహరాబాద్, న్యూస్టుడే: ప్రేమించిన యువతి దక్కలేదన్న బాధలో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. మనోహరాబాద్కు చెందిన మహ్మద్ పాషా, సమీనాబేగం దంపతులకు కొడుకు సోహెల్(24), ఒక కుమార్తె ఉన్నారు. సోహెల్ ఆటో నడుపుతాడు. కొన్ని రోజులుగా గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇందుకు ఆ యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ముభావంగా ఉంటున్నాడు. సోమవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశాడు. అందరూ వేర్వేరుగా నిద్రించారు. రాత్రి సమయంలో వచ్చిన శబ్దంతో నిద్ర లేచిన కుటుంబసభ్యులు గదిలో చూడగా సోహెల్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు తండ్రి పాషా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతికి అందివచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
హత్య కేసులో మహిళకు జీవితఖైదు
నర్సాపూర్: సహజీవనం సాగిస్తున్న వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో ఓ మహిళకు జీవితఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద మంగళవారం తీర్పునిచ్చారని ఎస్పీ బాలస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటకు చెందిన బత్తిని పద్మ, ఇదే గ్రామానికి చెందిన శివ(26)తో సహజీవనం సాగిస్తోంది. వీరిద్దరు 2019లో డబ్బు విషయమై గొడవపడ్డారు. దీంతో కక్షగట్టిన పద్మ.. శివను దారుణంగా హత్యచేసింది. అప్పట్లో హతుడి తల్లి వసంత ఫిర్యాదుతో సీఐ నాగయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన నాయమూర్తి లక్ష్మీశారద ఈ కేసులో నిందితురాలైన పద్మకు జీవితఖైదుతో పాటు, రూ.15 వేల జరిమానా విధించారని ఎస్పీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానాకాలం సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..ఇబ్బంది పెడుతూ..
[ 19-05-2024]
అభివృద్ధికి మారుపేరుగా నిలిచే జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మెదక్-ఎల్కతుర్తి 134 కి.మీ.ల 765డీజీ జాతీయ రహదారిని రూ.1,461 కోట్ల నిధులతో చేపట్టారు. -
చెరువు మట్టి.. పొలానికి పుష్టి
[ 19-05-2024]
రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకు పెరుగడంతో భూసారం తగ్గడమే కాకుండా చీడపీడల ఉద్ధృతితో పాటు పంట దిగుబడుల్లో తేడా ఏర్పడుతోంది. -
లెక్కలు తేలుస్తారు
[ 19-05-2024]
సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. -
సీఎం ముఖచిత్రంతో..రాత పుస్తకాలు
[ 19-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులు, -
తొలకరికే తొందరొద్దు
[ 19-05-2024]
తొలకరి వర్షాలకే రైతులు తొందరపడి ఎలాంటి విత్తనాలు విత్తొద్దు.. భూమిలో 60 శాతానికి పైగా తేమ ఉన్నప్పుడే విత్తాలి.. ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం -
4 రోజులు.. రూ.4.29 కోట్లు
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. -
సైబర్ నేరస్థులకు ‘మ్యూల్’ ఖాతాలు
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
[ 19-05-2024]
భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేత రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. -
అటు.. ఇటు ఓటేశారు!
[ 19-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
పఠనాసక్తికి బాసట
[ 19-05-2024]
విద్యార్థులు సెలవులు రాగానే చరవాణులకు, టీవీలకు అతుక్కుపోతుంటారు. కేవలం పాఠశాలలు కొనసాగుతున్నప్పుడే చదువుపై దృష్టిపెడుతున్నారు. -
హామీలు అమలు చేయకుంటే రోడ్డెక్కుతాం: భారాస
[ 19-05-2024]
ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేదంటే రోడ్డెక్కుతామని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. -
అన్నదాతల ఆందోళన
[ 19-05-2024]
పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన రైతులు లారీల సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తాజా వార్తలు (Latest News)
-
మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు