కొత్త హామీలు ఇవ్వక.. పాతవి రద్దు చేస్తున్నారు
‘కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాల హయాంలో ఘనపూర్ ఆనకట్ట నాశనమైంది, భారాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.150 కోట్లతో బాగు చేశాం, ఆనకట్ట ఎత్తుపెంచాం.
‘దుబ్బాకలో చెల్లని నోటు మెదక్లో’ చెల్లుతుందా?
భారాస అధినేత కేసీఆర్
కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తున్న కేసీఆర్, పక్కన వెంకట్రామి రెడ్డి
న్యూస్టుడే, మెదక్, మెదక్ టౌన్, మెదక్ రూరల్: ‘కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాల హయాంలో ఘనపూర్ ఆనకట్ట నాశనమైంది, భారాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.150 కోట్లతో బాగు చేశాం, ఆనకట్ట ఎత్తుపెంచాం. కాళేశ్వరం నీళ్లతో హల్దీ ప్రాజెక్టును నింపాం... మంజీరా, హల్దీపై చెక్డ్యాంల నిర్మించి పొలాలను పండించామని, ఈ రెండు ఎండిపోకుండా కాపాడుకున్నామని’ భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మెదక్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రాందాస్చౌరస్తాలో ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. మెదక్ పట్టణ కేంద్రంగా జిల్లా, రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేశామని, మెదక్లో ప్రభుత్వ వైద్యకళాశాలను మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త హామీలు ఇవ్వకపోగా, పాత ప్రభుత్వంలో మంజూరు చేసిన వాటిని రద్దు చేస్తోందని విమర్శించారు. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేస్తున్న మరో ఇద్దరు అభ్యర్థులు గురించి నేను చెప్పేది ఏమీ లేదు... మీకు తెలుసని పేర్కొన్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్రావు మాట్లాడేవన్ని అబద్ధాలేనని విమర్శించారు. దుబ్బాకలో చెల్లని నోటు... మెదక్ పార్లమెంట్లో చెల్లుతదా అని కేసీఆర్ ప్రశ్నించారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి డబ్బులకోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఆయనను గెలిపించాలని కోరారు. మీటింగ్ అనంతరం కేసీఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.
శ్రేణుల్లో ఉత్సాహం
సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మెదక్లో మంగళవారం భారాస నిర్వహించిన రోడ్షో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. సాయంత్రం 7.30 గంటలకు రావాల్సిన కేసీఆర్ మెదక్కు రాత్రి 9.20కు చేరుకున్నారు. దాదాపు 18 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. రోడ్షోలో ఎమ్మెల్యేలు ప్రభాకర్రెడ్డి, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు హేమలతగౌడ్, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలి: మాజీ మంత్రి హరీశ్రావు
ఆరు గ్యారంటీల అమలు చేస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో బుద్ది చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. రూ.4వేలు పింఛన్ ఖాతాలో పడిన వారు, కాంగ్రెస్కు, పడని వారు భారాసకు ఓటు వేయాలని, రూ.4వేలు ఇప్పించే విషయమై తాను అసెంబ్లీలో జిమ్మెదార్ తీసుకుంటానని పేర్కొన్నారు. పదిహేనురోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, మద్దతు ధర ఇవ్వడం లేదని ఆరోపించారు. భాజపాకు ఓటు వేస్తే నీళ్లు లేని బావిలో పడినట్టేనని విమర్శించారు. మోదీ హయంలో గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయని, 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు.
ఐదు హామీలు నెరవేరుస్తా: భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి
పదకొండు ఏళ్ల పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారిగా పనిచేశానని, ఎంత చేసినా ఈ గడ్డ రుణం తీర్చుకోలేనని భారాస మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రజాసమస్యలు తనకు తెలుసనని, అభ్యర్థులను బేరీజు వేసుకొని, విషయ పరిజ్ఞానం ఉన్న, ప్రజాపాలన తెలిసిన తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో గెలిచాక తాను ఇచ్చిన ఐదు హమీలను అమలు చేస్తానని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానాకాలం సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..ఇబ్బంది పెడుతూ..
[ 19-05-2024]
అభివృద్ధికి మారుపేరుగా నిలిచే జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మెదక్-ఎల్కతుర్తి 134 కి.మీ.ల 765డీజీ జాతీయ రహదారిని రూ.1,461 కోట్ల నిధులతో చేపట్టారు. -
చెరువు మట్టి.. పొలానికి పుష్టి
[ 19-05-2024]
రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకు పెరుగడంతో భూసారం తగ్గడమే కాకుండా చీడపీడల ఉద్ధృతితో పాటు పంట దిగుబడుల్లో తేడా ఏర్పడుతోంది. -
లెక్కలు తేలుస్తారు
[ 19-05-2024]
సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. -
సీఎం ముఖచిత్రంతో..రాత పుస్తకాలు
[ 19-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులు, -
తొలకరికే తొందరొద్దు
[ 19-05-2024]
తొలకరి వర్షాలకే రైతులు తొందరపడి ఎలాంటి విత్తనాలు విత్తొద్దు.. భూమిలో 60 శాతానికి పైగా తేమ ఉన్నప్పుడే విత్తాలి.. ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం -
4 రోజులు.. రూ.4.29 కోట్లు
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. -
సైబర్ నేరస్థులకు ‘మ్యూల్’ ఖాతాలు
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
[ 19-05-2024]
భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేత రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. -
అటు.. ఇటు ఓటేశారు!
[ 19-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
పఠనాసక్తికి బాసట
[ 19-05-2024]
విద్యార్థులు సెలవులు రాగానే చరవాణులకు, టీవీలకు అతుక్కుపోతుంటారు. కేవలం పాఠశాలలు కొనసాగుతున్నప్పుడే చదువుపై దృష్టిపెడుతున్నారు. -
హామీలు అమలు చేయకుంటే రోడ్డెక్కుతాం: భారాస
[ 19-05-2024]
ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేదంటే రోడ్డెక్కుతామని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. -
అన్నదాతల ఆందోళన
[ 19-05-2024]
పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన రైతులు లారీల సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తాజా వార్తలు (Latest News)
-
మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు