జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు: మంత్రి సురేఖ
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని మంత్రి కొండా సురేఖ అన్నారు.
రాహుల్గాంధీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి కొండా సురేఖ, మైనంపల్లి హన్మంతరావు, మదన్రెడ్డి, రాజిరెడ్డి, ఆంజనేయులుగౌడ్
నర్సాపూర్, న్యూస్టుడే: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇక్కడి నుంచి గెలిచిన ఇందిరా గాంధీ ప్రధాని అయ్యారని.. ఆమె కృషి వల్లే ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పడి.. ఎంతోమందికి ఉద్యోగాలు, ఉపాధి లభించాయని పేర్కొన్నారు. నర్సాపూర్లోని వెల్దుర్తి వెళ్లే మార్గంలో నిర్వహించే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇదే జిల్లాకు చెందిన కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి మెదక్కు ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. కేంద్రంలో వారి ప్రభుత్వం ఉన్నా.. భాజపా అభ్యర్థి రఘునందన్రావు నయాపైసా సాధించలేక పోయారని అన్నారు. కలెక్టర్గా పనిచేసిన భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పేదల భూములు లాక్కొని, వారిని హింసించి, కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడి.. రూ.కోట్ల సంపాదించి, కేసీఆర్కూ కూడబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి బలహీన వర్గానికి చెందిన నీలం మధుకు టికెట్ ఇచ్చామని, ఆయన నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి అని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులు మెదక్ జిల్లాకు చెందిన వారు కావడంతో ఇక్కడ గట్టిపోటీ నెలకొందని, ఎలాగైనా మెదక్ సీటు ఈసారి కాంగ్రెస్దేనని అన్నారు. ఇదివరకే సీఎం రేవంత్రెడ్డి జిల్లాలో రెండు సార్లు పర్యటించి వెళ్లారని, తిరిగి ఈనెల 10న పటాన్చెరు వస్తున్నారని అన్నారు.
సభ జయప్రదం చేయండి: నర్సాపూర్లో నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ బహిరంగ సభను జయప్రదం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎక్కువ ఎంపీ స్థానాలను గెలిపించి.. రాహుల్గాంధీని ప్రధానిని చేయాలని కోరారు. ఏఐసీసీ పరిశీలకుడు, కేరళ ఎంపీ సురేశ్, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మదన్రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి, ప్రోగాం బాధ్యులు విశ్వనాథన్ ఉన్నారు.
రాహుల్ గాంధీ సభకు భారీ ఏర్పాట్లు
నర్సాపూర్: గతంలో తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నర్సాపూర్లో గురువారం నిర్వహిస్తున్న బహిరంగ సభకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, దుబ్బాక, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున జనాలను తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 50వేల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నర్సాపూర్లో వెల్దుర్తి వెళ్లే మార్గంలో నిర్వహిస్తున్న సభకు రాహుల్ గాంధీ హెలికాప్టర్లో సాయంత్రం 4గంటలకు వస్తారని నేతలు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానాకాలం సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..ఇబ్బంది పెడుతూ..
[ 19-05-2024]
అభివృద్ధికి మారుపేరుగా నిలిచే జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మెదక్-ఎల్కతుర్తి 134 కి.మీ.ల 765డీజీ జాతీయ రహదారిని రూ.1,461 కోట్ల నిధులతో చేపట్టారు. -
చెరువు మట్టి.. పొలానికి పుష్టి
[ 19-05-2024]
రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకు పెరుగడంతో భూసారం తగ్గడమే కాకుండా చీడపీడల ఉద్ధృతితో పాటు పంట దిగుబడుల్లో తేడా ఏర్పడుతోంది. -
లెక్కలు తేలుస్తారు
[ 19-05-2024]
సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. -
సీఎం ముఖచిత్రంతో..రాత పుస్తకాలు
[ 19-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులు, -
తొలకరికే తొందరొద్దు
[ 19-05-2024]
తొలకరి వర్షాలకే రైతులు తొందరపడి ఎలాంటి విత్తనాలు విత్తొద్దు.. భూమిలో 60 శాతానికి పైగా తేమ ఉన్నప్పుడే విత్తాలి.. ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం -
4 రోజులు.. రూ.4.29 కోట్లు
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. -
సైబర్ నేరస్థులకు ‘మ్యూల్’ ఖాతాలు
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
[ 19-05-2024]
భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేత రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. -
అటు.. ఇటు ఓటేశారు!
[ 19-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
పఠనాసక్తికి బాసట
[ 19-05-2024]
విద్యార్థులు సెలవులు రాగానే చరవాణులకు, టీవీలకు అతుక్కుపోతుంటారు. కేవలం పాఠశాలలు కొనసాగుతున్నప్పుడే చదువుపై దృష్టిపెడుతున్నారు. -
హామీలు అమలు చేయకుంటే రోడ్డెక్కుతాం: భారాస
[ 19-05-2024]
ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేదంటే రోడ్డెక్కుతామని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. -
అన్నదాతల ఆందోళన
[ 19-05-2024]
పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన రైతులు లారీల సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ