గోదావరి దరి చేరాలంటే..గులాబీ గుబాళించాలి
నర్సాపూర్ ప్రాంతంలోని లక్షల ఎకరాల పొలాలు సస్యశ్యామలం చేసేందుకు, శాశ్వతంగా సాగు నీరందించేందుకు కాళేశ్వరం ప్రధాన కాల్వల పనులను ప్రారంభించాం.. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తుందన్న నమ్మకం లేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
నర్సాపూర్లో భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్
నర్సాపూర్లో కార్నర్ మీటింగ్కు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న కేసీఆర్, చిత్రంలో వెంకట్రామిరెడ్డి
నర్సాపూర్, నర్సాపూర్ రూరల్, శివ్వంపేట, న్యూస్టుడే: నర్సాపూర్ ప్రాంతంలోని లక్షల ఎకరాల పొలాలు సస్యశ్యామలం చేసేందుకు, శాశ్వతంగా సాగు నీరందించేందుకు కాళేశ్వరం ప్రధాన కాల్వల పనులను ప్రారంభించాం.. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తుందన్న నమ్మకం లేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నర్సాపూర్ పట్టణం ప్రధాన కూడలిలో మెదక్ లోక్సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా, బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్షో, కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రాంతానికి గోదావరి నీటిని సాగు అవసరాలకు ఇవ్వడం నా కల, కాలువలు పూర్తయి, మల్లన్న సాగర్ నుంచి జలం రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు తునక అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇది సాకారం కావాలంటే వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. తాగు నీటిని సరఫరా చేసేందుకు సిద్దిపేట జిల్లా కోమటిబండ నుంచి ప్రత్యేక లైన్ వేయించా, ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది.. అవి పూర్తయితే గోదావరి నీరందుతుందని స్పష్టం చేశారు. నర్సాపూర్ పురపాలిక అభివృద్ధికి రూ.25 కోట్లు ఇస్తే, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం వాపస్ తీసుకుందని.. గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన నిధులను కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొల్చారంలో ప్రముఖ కవి మల్లినాథసూరి పేరుతో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకోసం ప్రయత్న చేయడం లేదని విమర్శించారు. భారాస ప్రభుత్వ హయాంలో మంజీరా నదిపై 10 చెక్డ్యాంలు నిర్మించాం. వాటి ద్వారా రైతులు సిరులు పండిస్తున్నారన్నారు.
గజ్వేల్ వద్ద అభివాదం చేస్తున్న కేసీఆర్
పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం...: కేసీఆర్ రోడ్షో విజయవంతం కావడంతో భారాస శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. నర్సాపూర్కు సాయంత్రం ఐదు గంటలకు రావాల్సిన కేసీఆర్ 7గంటలకు వచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ప్రజలు భవనాలపైన, హోర్డింగ్లపై నిల్చుని వీక్షించారు. ట్రాఫిక్లో రోడ్డుపై చిక్కుకున్న వాహనాలపైనా నిల్చుని ప్రసంగాన్ని విన్నారు. అంతకుముందు కళాకారులు పాటలతో ఉత్సాహపర్చారు. కార్నర్ మీటింగ్లో మాజీ ముఖ్యమంత్రి ఒక్కరే ప్రసంగించారు. సమావేశం ముగిసిన అనంతరం సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు వెెళ్లారు.
ప్రజలకు నమస్కరిస్తున్న హరీశ్రావు
మదన్రెడ్డి పార్టీ మారడం అవసరమా..
భారాసలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి ఎక్కడికి పోయారు? మీ అందరికీ నా చరిత్ర, మదన్రెడ్డి చరిత్ర తెలుసు. తెలుగుదేశంలో ఉండగా రెండు సార్లు ఆయనకు టికెట్ ఇపి‡్పంచా.. ఓడిపోయారు. భారాసలో రెండుసార్లు ఎమ్మెల్యేను చేశానన్నారు. 75 ఏళ్ల వయసులో ‘ముసలి తనానికి కుసుమ గుడాలు’ అన్నట్లుగా..ఆయన పార్టీలు మారడం అవసరమా? ఏం చేద్దామని ఆ పార్టీలో చేరాడని ప్రశ్నించారు. ఆయన చేసింది న్యాయమేనా? మీరే చెప్పాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ మెడలు వంచి, వారు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలంటే పార్లమెంట్లో ప్రజల గొంతుకను వినిపించాలంటే వెంకట్రామిరెడ్డిని గెలిపించాలన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు హేమలత గౌడ్, రాష్ట్ర నాయకులు ఫారూక్హుస్సేన్ ఎర్రోల్ల శ్రీనివాస్, యు.దేవేందర్రెడ్డి, గోపి, జడ్పీకో-ఆప్షన్ సభ్యులు మన్సూర్, పురపాలిక అధ్యక్షులు అశోక్గౌడ్, పార్టీ మండలాధ్యక్షులు బోగశేఖర్ పాల్గొన్నారు.
హోర్డింగ్లపై నిల్చొని ప్రసంగం వింటూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానాకాలం సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..ఇబ్బంది పెడుతూ..
[ 19-05-2024]
అభివృద్ధికి మారుపేరుగా నిలిచే జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మెదక్-ఎల్కతుర్తి 134 కి.మీ.ల 765డీజీ జాతీయ రహదారిని రూ.1,461 కోట్ల నిధులతో చేపట్టారు. -
చెరువు మట్టి.. పొలానికి పుష్టి
[ 19-05-2024]
రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకు పెరుగడంతో భూసారం తగ్గడమే కాకుండా చీడపీడల ఉద్ధృతితో పాటు పంట దిగుబడుల్లో తేడా ఏర్పడుతోంది. -
లెక్కలు తేలుస్తారు
[ 19-05-2024]
సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. -
సీఎం ముఖచిత్రంతో..రాత పుస్తకాలు
[ 19-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులు, -
తొలకరికే తొందరొద్దు
[ 19-05-2024]
తొలకరి వర్షాలకే రైతులు తొందరపడి ఎలాంటి విత్తనాలు విత్తొద్దు.. భూమిలో 60 శాతానికి పైగా తేమ ఉన్నప్పుడే విత్తాలి.. ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం -
4 రోజులు.. రూ.4.29 కోట్లు
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. -
సైబర్ నేరస్థులకు ‘మ్యూల్’ ఖాతాలు
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
[ 19-05-2024]
భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేత రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. -
అటు.. ఇటు ఓటేశారు!
[ 19-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
పఠనాసక్తికి బాసట
[ 19-05-2024]
విద్యార్థులు సెలవులు రాగానే చరవాణులకు, టీవీలకు అతుక్కుపోతుంటారు. కేవలం పాఠశాలలు కొనసాగుతున్నప్పుడే చదువుపై దృష్టిపెడుతున్నారు. -
హామీలు అమలు చేయకుంటే రోడ్డెక్కుతాం: భారాస
[ 19-05-2024]
ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేదంటే రోడ్డెక్కుతామని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. -
అన్నదాతల ఆందోళన
[ 19-05-2024]
పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన రైతులు లారీల సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ