మూడు రంగులు ఎగరాలి.. మెతుకు సీమ మురవాలి
ముష్కరుల చేతిలో ఇందిరాగాంధీ తూటాలకు బలైనప్పుడు దేశానికి ప్రధానిగా, మెదక్కు ఎంపీగా ఉన్నారని, చివరి శ్వాస, ఆఖరి రక్తపుబొట్టు చిందేవరకు ఈ ప్రాంతానికి ఆమె ప్రాతినిధ]్యం వహించారని.. మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే ఆమె కన్ను మూశారని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు.
నర్సాపూర్ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, చిత్రంలో సీఎం రేవంత్రెడ్డి
నర్సాపూర్, నర్సాపూర్ రూరల్, శివ్వంపేట, వెల్దుర్తి, న్యూస్టుడే: ముష్కరుల చేతిలో ఇందిరాగాంధీ తూటాలకు బలైనప్పుడు దేశానికి ప్రధానిగా, మెదక్కు ఎంపీగా ఉన్నారని, చివరి శ్వాస, ఆఖరి రక్తపుబొట్టు చిందేవరకు ఈ ప్రాంతానికి ఆమె ప్రాతినిధ]్యం వహించారని.. మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే ఆమె కన్ను మూశారని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. నర్సాపూర్లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా గురువారం నిర్వహించిన జనజాతర సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు సీఎం ప్రసంగించారు. భాజపా, భారాస నుంచి విముక్తి కలిగించే అవకాశం మీ చేతుల్లోనే ఉంది, ఈ ఎన్నికల ద్వారా ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని, అందుకే రాహుల్గాంధీ బలహీన వర్గాల బిడ్డ నీలం మధుకు పోటీచేసే అవకాశం కల్పించారని చెప్పారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి దేశ చరిత్రలో గొప్ప పేరుందని, ఆనాడు జనతా పార్టీ విఫలమై దేశ రాజకీయాలు అస్తవ్యస్తంగా మారిన సమయంలో ఇందిరాగాంధీ 1980లో మెదక్ నుంచి ఎన్నికల బరిలో¨ నిలిచి అత్యధిక మెజార్టీతో గెలుపొందారన్నారు. ఆ సమయంలో ఆమె దేశానికి ప్రధానిగా ఎన్నికైన విషయం ఇక్కడ ఉన్న ప్రతి మెదక్ బిడ్డకు తెలుసన్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక మోదీ నుంచి వేల కోట్లు తెస్తానని మాటలు చెప్పి, దుబ్బాక ప్రజలను మోసం చేశారన్నారు. భూములకు నష్టపరిహారం ఇవ్వండని అడిగిన రైతులను భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పోలీసులతో కొట్టించారని విమర్శించారు. ఆయనను చిత్తుగా ఓడించాలన్నారు. కాంగ్రెస్ జెండా ఎగరాలి, మెతుకు సీమ మురవాలని పేర్కొన్నారు.
సోనియా, రాహుల్, ప్రియాంక, చిత్రపటాలను ప్రదర్శిస్తూ..
శ్రేణుల్లో ఉత్సాహం: జన జాతర బహిరంగ సభలో అగ్రనేత రాహుల్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు ప్రసంగాలు కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఎండలను సైతం లెక్క చేయకుండా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.
సభలో పదనిసలు
పెన్సిల్తో గీసిన రాజీవ్గాంధీ చిత్రాన్ని చూస్తున్న రాహుల్, సీఎం, మంత్రి సురేఖ
- సభకు రాహుల్గాంధీÅ సాయంత్రం 4.20 గంటలకు హెలికాప్టర్లో వచ్చారు.
- అగ్రనేత రాహుల్, సీఎం రేవంత్రెడ్డి అభివాదం చేస్తూ వేదికపైకి వస్తుండగా, సభలో కార్యకర్తలు, నాయకులు కేరింతలు కొట్టారు.
- వేదికపైకి రాహుల్ రావడానికి ముందు మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మాట్లాడారు.
- సభావేదిక వద్ద ‘గాడిద గుడ్డు’ అనే బొమ్మను ప్రదర్శనకు ఉంచారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో వాటిని ప్రదర్శించారు.
- సభకు పెద్దఎత్తున ప్రజలు తరలివరావడంతో, సభ ముగిశాక వేదిక నుంచి నర్సాపూర్ వరకు ట్రాఫిక్ స్తంభించింది.
- నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి ఎంపీటీసీ సంధ్యారాణి నాయక్, తన నానమ్మ కెస్లీభాయి ఇందిరాగాంధీతో దిగిన చిత్రాన్ని రాహుల్గాంధీకి బహూకరించారు.
- పటాన్చెరుకు చెందిన విద్యార్థి చిట్ల కార్తిక్ పెన్సిల్తో గీసిన మాజీ ప్రధాని రాజీవ్గాంధీ చిత్రపటాన్ని, రాహుల్గాంధీకి బహూకరించారు.
మదన్రెడ్డిని కేసీఆర్ ఏదో అనిపోయిండంట..:
నర్సాపూర్కు వచ్చిన కేసీఆర్ బస్యాత్ర చూస్తుంటే ‘తిక్కలోడు తిరునాళ్లకు పోతుంటే.. ఎక్కడానికి, దిగడానికే సరిపోయిందంట’ అని రేవంత్ ఎద్దేవా చేశారు. పెద్దలు మదన్రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ ఏదేదో అనిపోయిండంట, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని, ప్రజలు ఆయనను తిరస్కరించారన్న విషయాన్ని గమనించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీచేస్తున్న భారాస అభ్యర్థి డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఇందుకు నర్సాపూర్ నుంచే పునాదులు పడతాయని పేర్కొన్నారు. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, ఇనాళ్లు భాజపా, భారాసను గెలిపించారు, ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. సభలో మంత్రులు కొండా సురేఖ, దామోదర్ మాట్లాడారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మదన్రెడ్డి, జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, నిర్మలారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు జెట్టి కుసుమకుమార్, మాజీ ఎమ్మెల్సీలు రాములునాయక్, ఆర్.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
సభకు తరలివస్తున్న ప్రజలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానాకాలం సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..ఇబ్బంది పెడుతూ..
[ 19-05-2024]
అభివృద్ధికి మారుపేరుగా నిలిచే జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మెదక్-ఎల్కతుర్తి 134 కి.మీ.ల 765డీజీ జాతీయ రహదారిని రూ.1,461 కోట్ల నిధులతో చేపట్టారు. -
చెరువు మట్టి.. పొలానికి పుష్టి
[ 19-05-2024]
రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకు పెరుగడంతో భూసారం తగ్గడమే కాకుండా చీడపీడల ఉద్ధృతితో పాటు పంట దిగుబడుల్లో తేడా ఏర్పడుతోంది. -
లెక్కలు తేలుస్తారు
[ 19-05-2024]
సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. -
సీఎం ముఖచిత్రంతో..రాత పుస్తకాలు
[ 19-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులు, -
తొలకరికే తొందరొద్దు
[ 19-05-2024]
తొలకరి వర్షాలకే రైతులు తొందరపడి ఎలాంటి విత్తనాలు విత్తొద్దు.. భూమిలో 60 శాతానికి పైగా తేమ ఉన్నప్పుడే విత్తాలి.. ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం -
4 రోజులు.. రూ.4.29 కోట్లు
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. -
సైబర్ నేరస్థులకు ‘మ్యూల్’ ఖాతాలు
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
[ 19-05-2024]
భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేత రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. -
అటు.. ఇటు ఓటేశారు!
[ 19-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
పఠనాసక్తికి బాసట
[ 19-05-2024]
విద్యార్థులు సెలవులు రాగానే చరవాణులకు, టీవీలకు అతుక్కుపోతుంటారు. కేవలం పాఠశాలలు కొనసాగుతున్నప్పుడే చదువుపై దృష్టిపెడుతున్నారు. -
హామీలు అమలు చేయకుంటే రోడ్డెక్కుతాం: భారాస
[ 19-05-2024]
ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేదంటే రోడ్డెక్కుతామని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. -
అన్నదాతల ఆందోళన
[ 19-05-2024]
పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన రైతులు లారీల సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తాజా వార్తలు (Latest News)
-
మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు