సేవకో ధర.. పర్యవేక్షణ అరకొర
భువనగిరికి చెందిన తుక్కాపురం జహంగీర్ శనివారం తన టాటా ఏసీ వాహనం రోడ్డు రవాణా పన్ను చెల్లించేందుకు పాత బస్టాండులో మీసేవ కేంద్రానికి వెళ్లారు. సాధారణంగా వాహన పన్ను రూ.1060, డిపార్ట్మెంట్ ఛార్జీ రూ.50 కలిపి మొత్తం రూ.1,110
భువనగిరి, భువనగిరి నేరవిభాగం, న్యూస్టుడే
భువనగిరి పట్టణంలోని మీసేవ కేంద్రం
భువనగిరికి చెందిన తుక్కాపురం జహంగీర్ శనివారం తన టాటా ఏసీ వాహనం రోడ్డు రవాణా పన్ను చెల్లించేందుకు పాత బస్టాండులో మీసేవ కేంద్రానికి వెళ్లారు. సాధారణంగా వాహన పన్ను రూ.1060, డిపార్ట్మెంట్ ఛార్జీ రూ.50 కలిపి మొత్తం రూ.1,110 చెల్లించాలి. నిర్వాహకులు మాత్రం అదనంగా పది రూపాయలు తీసుకొని రూ.1,110కి రసీదు మాత్రమే ఇచ్చారు. రుసుం పట్టికలో యూజర్ సర్వీస్ ఛార్జీలు లేవని పొందుపర్చారు. కానీ, రోడ్డు రవాణా పన్నుకు మాత్రం అదనంగా రూ.పది వసూలు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు.
జిల్లావ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో వివిధ సేవల నిమిత్తం నిర్దేశించిన ధరల కన్నా అధికంగా వసూలు చేస్తున్నారు. ఏ సేవకు ఎంత రుసుం తీసుకోవాలో అధికారులు నిర్ణయించారు. కానీ, అందుకు భిన్నంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. చాలా చోట్ల ధరల పట్టిక కనిపించటం లేదు. పౌరులకు కావాల్సిన వివిధ ధ్రువపత్రాలు, ఆన్లైన్ సేవలు, బిల్లుల చెల్లింపులు తదితర సేవల కోసం మీసేవ కేంద్రాలకు వెళ్తే నిర్దేశించిన రుసుం కంటే రూ.10 నుంచి రూ.50 వరకు దండుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిర్దేశిత రుసుం వసూలు అమలు కావటం లేదని వినియోగదారులు వాపోతున్నారు.
మీసేవ కేంద్రంలో ధరలు లేని పట్టిక
కనిపించని ఫిర్యాదు సమాచారం
జిల్లా వ్యాప్తంగా 17 మండలాల్లో 69 మీసేవ కేంద్రాలున్నాయి. వీటిలో రోజుకు సగటున సుమారు 800 నుంచి వెయ్యి మంది వరకు వివిధ రకాల సేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటున్నారు. అత్యధికంగా సంస్థాన్ నారాయణపురంలో తొమ్మిది, భువనగిరి పట్టణంలో ఆరు కేంద్రాలున్నాయి. ఆర్టీఏ కార్యాలయం భువనగిరిలోనే ఉండటంతో ఈ సేవలకు సంబంధించిన కార్యకలాపాలు అధికంగా సాగుతున్నాయి. ఆదాయం, కులం, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భూములకు సంబంధించిన పహాణీలతోపాటు వివిధ రకాల బిల్లుల చెల్లింపులు, భూములకు సంబంధించిన పత్రాలు, ఇతర కార్యకలాపాలకు ప్రజలు మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ప్రతి పనికి సంబంధించిన నిర్ణీత రుసుం వసూలు చేసి రసీదు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో సేవకు నిర్ణీత గడువులోగా పత్రాలు అందజేయాలి. ఎక్కువగా ఆధార్తోపాటు కులం, ఆదాయం, జనన, మరణ ధ్రువపత్రాలు, పహాణీలు, వివిధ పన్నుల చెల్లింపులకు అదనంగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. అధికంగా డబ్బులు తీసుకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా వినియోగదారులకు తెలియటం లేదు. ప్రతి మీసేవ కేంద్రంలో ఏ సేవకు ఎంత రుసుం చెల్లించాలో, అసౌకర్యానికి గురైతే ఫిర్యాదు చేయడానికి అధికారు చరవాణి సంఖ్యను తెలిపే పట్టికను అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
-సాయి, ఈ-మేనేజర్, యాదాద్రి భువనగిరి
మీ సేవ కేంద్రంలో ఛార్జీల పట్టిక, ఫిర్యాదు నెంబర్ల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. నిర్ణీత రుసుం కన్న అధికంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకొంటాం. ఎవరైన అధిక రుసుం వసూలు చేసినా.. గడువులోగా సేవలందించకున్నా రాష్ట్ర స్థాయి కాల్సెంటర్ నెంబర్ 1100 లేదా మా చరవాణి సంఖ్య 93984 24331కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి వివరిస్తూ.. నాయకులను విమర్శిస్తూ..!
[ 04-05-2024]
మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
టెయిల్పాండ్ మట్టిపై అక్రమార్కుల కన్ను!
[ 04-05-2024]
మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నుంచి ఇటుక బట్టీలు, పలు ప్రైవేట్ భూముల్లో నింపేందుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. -
నేత..ఆత్మీయత
[ 04-05-2024]
అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ తేదీ మరో పదిరోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
మరో సందడి షురూ..!
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. -
పరిశ్రమల స్థాపనతో యువత, మహిళలకు ఉపాధి
[ 04-05-2024]
‘ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎంపీలు పట్టించుకోలేదు. -
హృదయాన్ని తాకిన అక్షరం
[ 04-05-2024]
మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి (18 నెలలు). వీరిది నిరుపేద కుటుంబం. -
కూటమి గెలుపునకు కృషి చేయాలి
[ 04-05-2024]
దేశంలో ఇండియా కూటమి గెలుపు కోసం మిత్రపక్షాలన్నీ కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. -
భాజపాకు చోటివ్వొద్దు: బీవీ రాఘవులు
[ 04-05-2024]
లౌకికవాదానికి, అభివృద్ధి మార్గానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు చొటివ్వొద్దని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలను కోరారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..!
[ 04-05-2024]
పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, సారూప్య దుస్తులు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి: చామల
[ 04-05-2024]
ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 04-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా నిర్వహించారు. -
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నం: మంత్రి ఉత్తమ్
[ 04-05-2024]
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, దొండపాడు, చిలుకూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
తాజా వార్తలు (Latest News)
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు