పర్యవేక్షణ కొరవడి.. గట్టు దెబ్బతిని
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కట్ట నాణ్యతపై రోజురోజుకూ భయాందోళన పెరుగుతోంది. గత నెల 7న నిడమనూరు మండలం ముప్పారం వద్ద గండి పడి 13 రోజులు సాగు నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడ్డారు.
రైతులను కలవరపరుస్తున్న సాగర్ ఎడమ కాల్వ స్థితి
హాలియా వద్ద కుంగిన సాగర్ ఎడమ కాల్వ లైనింగ్
హాలియా, న్యూస్టుడే: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కట్ట నాణ్యతపై రోజురోజుకూ భయాందోళన పెరుగుతోంది. గత నెల 7న నిడమనూరు మండలం ముప్పారం వద్ద గండి పడి 13 రోజులు సాగు నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా హాలియా వద్ద 16.800 కి.మీ.వద్ద కాల్వ లైనింగ్ రోజు రోజుకూ కుంగిపోతుండడానికి తోడు చాలా చోట్ల ఇదే తీరుగా కాల్వ దెబ్బతిని కనిపిస్తుండడం రైతాంగాన్ని కలవరపరస్తోంది.
వేధిస్తున్న సిబ్బంది కొరత
ఎడమ కాల్వ 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా.. సుమారు 6.50 లక్షల ఎకరాలు సాగువుతోంది. ఎంతో ప్రాముఖ్యం గల ఈ కాల్వ పర్యవేక్షణకు సిబ్బంది కొరత వేధిస్తోంది. 15 ఏళ్లుగా సిబ్బంది నియామకం చేపట్టక, ఉన్న సిబ్బందిలో ఒక్కరొక్కరు పదవీ విరమణ పొందగా.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ప్రశ్నార్థకం అవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎడమ కాల్వ పొట్టిచెల్మ నుంచి మూసీ వరకు 4 జేఈలు ఉండాల్సి ఉండగా ఒక్కరు.. హాలియా, నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడ, వేములపల్లి, తడకమళ్ల, మూసీ సెక్షన్స్లో ఇద్దరు చొప్పున 14 మంది వర్క్ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా పది మంది, ప్రతీ సెక్షన్కు నలుగురు చొప్పున 28 మంది లష్కర్లు ఉండాల్సి ఉండగా 16 మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు 61 ఏళ్లకు పదివీ కాలం పెంపుదల చేయకుంటే ఇప్పటికే సగంమంది లష్కర్లు ఉద్యోగ విరమణ చేసే వారని ఓ అధికారి ‘న్యూస్టుడే’తో అభిప్రాయం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఆశాదీపమైన ఎడమ కాల్వపై నిర్లక్ష్యం చేయకుండా సిబ్బంది నియామకం చేపట్టి, తగిన మరమ్మతులను నాణ్యంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం - సంపత్, డీఈ, ఎన్నెస్పీ
ప్రస్తుతం ఎడమ కాల్వకు సంబంధించి వర్క్ ఇన్స్పెక్టర్లు, లష్కర్ల కొరత లేదు. జేఈ ఒక్కరు మాత్రమే ఉన్నారు. హాలియా, పెద్దదేవులపల్లి ఇన్ఫాల్ తదితర ప్రాంతాల్లో తలుపుల వద్ద నైట్ వాచ్మెన్లు, ఎలక్ట్రీషియన్ ఫిట్టర్, మెకానిక్ల కొరత ఉంది. సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.