చిల్లరే.. లెక్కేస్తే లక్షలే..!
నల్గొండ పట్టణానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల గ్యాస్ సిలిండరు మీద అదనపు వసూళ్లపై డెలివరీ బాయ్ను నిలదీశాడు. వెంటనే ఆ వ్యక్తి.. సిలిండరు ఇవ్వడానికి నిరాకరించాడు.
వంట గ్యాస్ ఇంటికి సరఫరాలో ఇష్టారాజ్యం
సిలిండర్పై రూ.20 నుంచి 50 వరకు వసూళ్లు
నల్గొండ కలెక్టరేట్, న్యూస్టుడే
నల్గొండ పట్టణానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల గ్యాస్ సిలిండరు మీద అదనపు వసూళ్లపై డెలివరీ బాయ్ను నిలదీశాడు. వెంటనే ఆ వ్యక్తి.. సిలిండరు ఇవ్వడానికి నిరాకరించాడు. గట్టిగా మాట్లాడితే ఇంటి బయటే సిలిండరు వదిలేశాడు. చేసేదిలేక విశ్రాంత ఉద్యోగి పూర్తి మొత్తం ఇవ్వాల్సి వచ్చింది.
నల్గొండ వెంకటేశ్వర కాలనీకి చెందిన ఓ గృహ వినియోగదారుడు ఇరవై రోజుల క్రితం గ్యాస్ తెప్పించుకున్నాడు. వాస్తవ సిలిండరు ధర కంటే.. అదనంగా రూ. 20 వసూలు చేశారు. సదరు గృహ వినియోగదారు ఇంటికి, గ్యాస్ గోదాముకు మధ్య దూరం కేవలం రెండు కిలోమీటర్ల లోపే.
నల్గొండ జిల్లా కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీకి చైతన్యపురి కాలనీ 5 కి.మీ దూరం లోపే ఉంది. ఇక్కడ వంట గ్యాస్ డోర్ డెలివరీ చేసేందుకు సంబంధిత ఏజెన్సీ డోర్ డెలివరీ బాయ్ సిలిండర్ ధర కంటే అదనంగా 25 రూపాయలు వసూలు చేశాడు. సదరు గృహిణి మారుమాట్లాడకుండా ఆ మొత్తం ఇచ్చేశారు.
ఉమ్మడి జిల్లాలో వంట గ్యాస్ సిలిండరు ధరపై అదనపు వసూళ్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గృహావసరాల గ్యాస్ సిలిండరు ధర బహిరంగ మార్కెట్కు అనుగుణంగా మారుతోంది. ఒక్కో నెలలో పెరుగుతూ, మరో నెలలో తగ్గుతూ ఉండటం వల్ల వాస్తవ ధర వినియోగదారులకు స్పష్టంగా తెలిసే పరిస్థితి ఉండటం లేదు. ఇదే ఎక్కువనుకుంటే.. సిలిండరు అసలు ధర కంటే.. ఇంటికి అందించే సమయంలో అదనంగా వసూలు చేస్తుండటం మరింత భారమవుతోంది. ఈ వసూళ్లు చిల్లరగా కనిపించినా.. నెలనెలా ఇది లక్షల్లో సాగుతోంది.
ఎప్పటి నుంచో అక్రమ వసూళ్ల దందా
జిల్లాలో గ్యాస్ సిలిండరు సరఫరా అక్రమ వసూళ్ల దందా ఎప్పటినుంచో సాగుతున్నా.. అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒక వైపు బిల్లులపై ఉన్న ధరకు అదనంగా చెల్లించవద్దని ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ఇంటికి తీసుకొచ్చే ఏజెన్సీ సిబ్బంది మాత్రం రూ.20 నుంచి రూ. 50 వరకూ ప్రాంతాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే సిలిండరుపై రూ.20 నుంచి 30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. చాలామంది గృహిణులు వాస్తవ మొత్తాన్ని గమనించకుండా అడిగినంతా ఇచ్చేస్తున్నారు. కొంతమంది ప్రశ్నిస్తే.. దురుసుగా ప్రవర్తించడం, సిలిండరు వెనక్కి తీసుకెళ్లిపోయి, తాళం వేసి ఉందని నమోదు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు తమకేమీ జీతం ఉండదని, తెచ్చినందుకు ఛార్జీల రూపంలో వచ్చేదే ఆదాయమని చెప్పడంతో మారుమాట్లాడకుండా ఆ మొత్తాన్ని ఇచ్చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలు నిర్ణయించిన ధరే తాము వసూలు చేస్తున్నామని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 50కి తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో మహిళలు చాలామంది దీపం పథకాన్ని వినియోగిస్తున్నారు. వీరికి ఏజెన్సీలు చాలా కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. తాము వెళ్లి సిలిండర్లను తెచ్చుకోలేక, ఇంటికి తీసుకొస్తే అదనపు మొత్తం చెల్లించలేక గ్యాస్ వినియోగానికి దూరం అవుతున్నారు.
ఐదు కిలోమీటర్లు దాటితేనే..
గ్యాస్ సిలిండర్లకు అదనంగా వసూలు చేయవద్దని ఏజెన్సీలకు చెబుతున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సిలిండరు డెలివరీ పరిధి ఐదు కిలోమీటర్ల లోపు ఉంటే ఉచితమేనని, పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. ఐదు నుంచి 30 కిలోమీటర్ల వరకైతే రూ.10 మాత్రమే అదనంగా వసూలు చేస్తారని తెలిపారు. ఏజెన్సీలు, సిబ్బంది వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అధికారులు వివరించారు.
ఏజెన్సీలు వాడేసుకుంటున్నాయి..!
గోదాం నుంచి వినియోగదారుడి ఇంటి వరకు సిలిండరును చేర్చి, ఖాళీ సిలిండరును మళ్లీ గోదాంలో చేర్చేందుకు గాను ప్రతి ఏజెన్సీకి సదరు కంపెనీలు రవాణా ఛార్జీలు చెల్లిస్తాయి. ఆ మొత్తాన్ని సిబ్బందికి ఇచ్చి, ఎమ్మార్పీకే సిలిండర్లను సరఫరా చేయాల్సిన బాధ్యత ఆయా ఏజెన్సీలదే. అయితే కంపెనీలిచ్చిన రవాణా ఛార్జీలను ఏజెన్సీలు వాడేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెన్సీలు తమకు జీతం ఇవ్వడం లేదని, వినియోగదారుల నుంచే వసూలు చేసుకోవాలంటున్నారని డెలివరీ బాయ్ ఒకరు తెలిపారు. సొంతవాహనంతో బండ చాకిరి చేస్తూ రూ. 20 మాత్రమే గ్యాస్ బండకు వసూలు చేస్తున్నట్లు వివరించాడు.
మనకు చిల్లరే అయినా.. మొత్తంగా రూ. లక్షల్లోనే..
ఉమ్మడి జిల్లాలో 71 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. సాధారణ, సీఎస్ఆర్, దీపం కలిపి మొత్తం 8,94,536 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ గ్యాస్ వినియోగం తప్పనిసరైంది. ఇందులో ప్రతి నెలా క్రమం తప్పకుండా సిలిండరు తీసుకుంటున్న కనెక్షన్లు 4 లక్షలు వేసుకున్నా.. ఒక్కో వినియోగదారుడి నుంచి సగటున రూ. 20 అదనపు వసూళ్లు అనుకున్నా.. మొత్తంగా 80 లక్షల రూపాయలను చెల్లిస్తున్నట్లే. మనం చిల్లరే కదా అని వదిలేసిన మొత్తం ఒక నెలలో రూ. 80 లక్షలు.
చర్యలు తీసుకుంటాం
- పుల్లయ్య, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి, సూర్యాపేట
గ్యాస్ డెలివరీ బాయ్స్ సిలిండర్ సరఫరా సమయంలో అదనంగా రూ.30 వసూలు చేస్తున్నారన్న విషయం మా దృష్టికి రాలేదు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.