నేర వార్తలు
గ్యారేజీలో డీసీఎం వాహనానికి మరమ్మతులు చేస్తుండగా.. డ్రైవర్ ముందుకు నడపడంతో మెకానిక్ మృతి చెందిన సంఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.
మరమ్మతులు చేస్తుండగా.. వాహనం ముందుకెళ్లడంతో మెకానిక్ మృతి
ఘట్కేసర్, న్యూస్టుడే: గ్యారేజీలో డీసీఎం వాహనానికి మరమ్మతులు చేస్తుండగా.. డ్రైవర్ ముందుకు నడపడంతో మెకానిక్ మృతి చెందిన సంఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వి.అశోక్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన గ్యార చంద్రయ్య(53) ఘట్కేసర్లోని తవక్కల్ ఆటో గ్యారేజ్లో పని చేస్తున్నాడు. బుధవారం మరమ్మతుల కోసం డీసీఎం గ్యారేజ్కు వచ్చింది. చంద్రయ్య వాహనం కిందకు వెళ్లి పని చేస్తుండగా... గమనించని డ్రైవర్ వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. తీవ్రగాయాలు కావడంతో తోటి కార్మికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. గురువారం మృతుడి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
హత్యానేరం కేసులో జీవిత ఖైదు
భువనగిరి నేరవిభాగం, న్యూస్టుడే: హత్యానేరం కేసులో భువనగిరి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన నిందితుడు నైని యాదగిరి(40)కు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా సెషన్స్ న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు యాదగిరి అదే కాలనీలోనే ఆయన పాలివాళ్లైన నైని పర్వతాలుతో కలిసి కూలీ పనిచేస్తుండేవాడు. యాదగిరి మద్యానికి బానిసై పనికి వెళ్లకుండా పర్వతాలును డబ్బులు అడిగేవాడు. డబ్బులు ఇచ్చేందుకు పర్వతాలు నిరాకరించడంతో యాదగిరి ఆయనపై కక్ష పెంచుకున్నాడు. 2017 జనవరి 17న పర్వతాలు ఆయన ఇంట్లో ఉండగా యాదగిరి వెళ్లి కర్రలతో దాడి చేసి త్రీవంగా గాయపర్చి కిరోసిన్ పోసి నిప్పటించి హత్య చేశాడు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు యాదగిరిపై భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో హత్యానేరం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కేసు విచారణాధికారిగా అప్పటి సీఐ ఎమ్.శంకర్ ఆధ్వర్యంలో కేసుకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను పోలీసులు సేకరించి అభియోగపత్రాలను న్యాయస్థానానికి అందజేశారు. న్యాయస్థానంలో వాదోపవాదాలతోపాటు విచారణ అనంతరం నిందితుడే హత్య చేసినట్లు రుజువుకావడంతో జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.బాలభాస్కరరావు తీర్పును వెల్లడించారు. దోషి యాదగిరికి జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.