దశాబ్ది జిలుగులు.. ప్రగతి పరుగులు
తెలంగాణ చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రూ.34 వేల కోట్లను సూర్యాపేట జిల్లా సమగ్రాభివృద్ధికి కేటాయించిందని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.
తెలంగాణ అవతరణ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి జగదీశ్రెడ్డి
కలెక్టరేట్లో జాతీయ జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్ వెంకటరావు, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, తదితరులు
ఉత్సవాలకు హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, ప్రముఖులు
సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్టుడే: తెలంగాణ చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రూ.34 వేల కోట్లను సూర్యాపేట జిల్లా సమగ్రాభివృద్ధికి కేటాయించిందని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. అందులో వ్యవసాయ రంగానికి, వాటి అనుబంధ విభాగాలకు పెద్దపీట వేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. శాంతికి చిహ్నంగా పావురాలను గాల్లోకి ఎగరవేశారు. అనంతరం కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి మాట్లాడారు.
జాతీయ జెండాకు వందనం సమర్పిస్తున్న మంత్రి జగదీశ్రెడ్డి, చిత్రంలో కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్
* ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రంలో విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టినా ఆ కుదుపు నుంచి అనతికాలంలోనే తెలంగాణ బయటపడి సుస్థిరంగా ముందుకు సాగుతుందంటే ముమ్మాటికీ కేసీఆర్ ఘనత మాత్రమే.
* 2017 నుంచి 2022 మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయ వృద్ధిరేటు 11.08 శాతంతో రికార్డు సృష్టించింది. సూర్యాపేట జిల్లాలో నీటి పారుదల, ఆయకట్ల అభివృద్ధికి రూ.2,445.47 కోట్లు, విద్యుత్తు శాఖకు రూ.1,558.18 కోట్లు, మిషన్ భగీరథకు రూ.1,216 కోట్లు, వవర్కెటింగ్ శాఖ ద్వారా రూ.22.50 కోట్లు ఖర్చు పెట్టాం.
* విద్య, ఆరోగ్య శాఖకు తొమ్మిదేళ్లలో రూ.984.77 కోట్లు, విద్యా శాఖకు కేటాయించిన రూ.417.82 కోట్లతో అభివృద్ధి సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం కేవలం ఆరు గురుకులాలు మాత్రమే ఉన్న సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 19 గురుకులాలు, రెండు డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశాం.
* మహిళా శిశు సంక్షేమ, వికలాంగులు, వయోవృద్ధుల శాఖకు రూ.74.44 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పురపాలిక సంఘాల అభివృద్ధికి రూ.556.57 కోట్లు, పట్టణ పేదరిక నిర్మూలనకు రూ.1,456.20 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.6,180.90 కోట్లను వెచ్చించాం.
* జిల్లాలో ఇంతటి పురోభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంతో పాటు అధికారుల నిరంతర కృషి ఉంది. శాంతి భద్రతల రంగంలో పోలీసుల పనితీరు ఎంతో మెరుగ్గా ఉంది.
* అనంతరం పరేడ్ గ్రౌండ్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, శకటాల ప్రదర్శనను తిలకించారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులను సన్మానించారు.
* కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ గుజ్జ దీపిక, జిల్లా ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ ఛైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి : కలెక్టర్
సూర్యాపేట కలెక్టరేట్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నట్లు కలెక్టర్ వెంకటరావు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్తో కలిసి కలెక్టర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అధికారులు ప్రభుత్వ పథకాల అమలుకు పాటుపడాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో సీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో కిరణ్, డీపీవో యాదయ్య, డీఏవో రామారావు నాయక్, డీహెచ్వో శ్రీధర్ పాల్గొన్నారు.
సూర్యాపేటలోని జడ్పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేస్తున్న ఛైర్పర్సన్ గుజ్జ దీపిక, వైస్ ఛైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, సీఈవో సురేశ్, తదితరులు
సూర్యాపేట: కాంగ్రెస్ కార్యాలయంలో అవతరణ వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం