ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.
నల్గొండలో ఓటరు చైతన్యం ఛాయా చిత్ర ప్రదర్శనను ప్రారంభిస్తున్న కలెక్టర్ దాసరి హరిచందన, చిత్రంలో సీబీసీ జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వర్రావు, తదితరులు
నల్గొండ విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడంలో ఓటర్లు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. యువకులు పోలింగ్ రోజున సమయాన్ని వృథా చేయకుండా ఓటు వేయాలని కోరారు. ఓటరు అవగాహన కోసం జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ పాకెట్ల వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రలోభ రహితంగా ఎన్నికల నిర్వహణకు సహకరించే బాధ్యత ఓటర్లదేనని తెలిపారు. ఈ ఛాయచిత్ర ప్రదర్శన ఈనెల 27 వరకు కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో 1951 నుంచి ప్రారంభమైన భారత ఎన్నికల చరిత్ర, మొబైల్ యాప్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకు అన్ని అంశాను ప్రదర్శనలో వివరించారు. జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ సహాయ సంచాలకులు యు.వెంకటేశ్వర్లు, సీబీసీ జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వరరావు, డీఎంహెచ్ఓ డా.కొండల్రావు, ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అరుణ్కుమార్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఘనశ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు వచ్చిన పరిశీలకులు
నల్గొండ సంక్షేమం: లోక్సభ ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాకు నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్కుమార్ మాణిక్రావు సూర్యవంశీ(2010 ఐఏఎస్ బ్యాచ్ అధికారి) గురువారం జిల్లాకు వచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తన ఛాంబర్లో వారికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. పోలింగ్ ముగిసే వరకు ఆయన ఎన్నికల నిర్వహణను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం జిల్లాకు నియమితులైన పోలీసు పరిశీలకుడు ఆమోఘ్జీవన్ గాంకర్(2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి)తో కలిసి ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎస్పీ చందనాదీప్తి, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
నల్గొండ విద్యావిభాగం: ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. ముందస్తు జాగ్రత్తచర్యలపై జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా.కొండల్రావు స్వయంగా రచించి, రూపొందించి గానం చేసిన ఆడియో పాటల సీడీలను గురువారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు. ఎండలు ఎక్కువ ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే వదులు దుస్తులు, లేత పల్చటివి ధరించాలన్నారు. నిల్వ ఉంచిన ఆహారం, మాంసాహారం తినకుండా చూసుకోవాలన్నారు. ద్రవపదార్ధాలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. ఓఆర్ఎస్ పొట్లాలు ప్రభుత్వ ఆసుపత్రులు, ఆశావర్కర్ల వద్ద సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.కొండల్రావు, సమాచారశాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు, సీబీసీ జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వరరావు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఘనశ్యాం, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వడగళ్ల వాన.. పంట నష్టం
[ 05-05-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలోని పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది. ఆత్మకూర్ (ఎస్) మండలంలో పెద్ద ఎత్తున ఈదురు గాలులతో వర్షం కురిసింది. -
అవకాశవాదులను ఓడించాలి: సీపీఎం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశవాదులను ఓడించి ప్రజాస్వామ్య వాదులను గెలిపించాలని ఐద్వా ఉపాధ్యక్షురాలు కేఎన్ ఆశలత అన్నారు. -
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలి: చామల కిరణ్ కుమార్ రెడ్డి
[ 05-05-2024]
భువనగిరి దీప్తి హోటల్లో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. -
తీవ్ర ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
[ 05-05-2024]
తీవ్రమైన వేసవి ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
భారాస అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం
[ 05-05-2024]
పేద ప్రజలకు భారాస వల్లే లాభం చేకూరుతుందని భారాస నాయకులు అన్నారు. -
భానుడి వేడి..దొరకని నాడి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
ప్రచారం కన్నా... సమీక్షలే మిన్నా..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో ఏడు రోజులే గడువు ఉన్నా.. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం ఊపందుకోలేదు. -
మనమే కారణం.. మేల్కోకుంటే దారుణం
[ 05-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
అప్రమత్తతే శ్రీరామరక్ష
[ 05-05-2024]
మిర్యాలగూడ పట్టణంలో శనివారం దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. -
రైతు భరోసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
గంగా, సబర్మతి మాదిరిగా మూసీ ప్రక్షాళన
[ 05-05-2024]
ఈ ప్రాంత ప్రజలను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మూసీ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. గంగా, సబర్మతి నదుల్లాగా మూసీని కాలుష్యరహితంగా తయారు చేస్తామని భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. -
చుక్క నీరు కూడా వదులుకోబోం: మంత్రి ఉత్తమ్
[ 05-05-2024]
ప్రస్తుత ఎన్నికలు భారతదేశ దిశ, దశ మార్చేవని, ప్రతి ఓటరూ ఇది గుర్తించి ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. -
నాలుగు లక్షల మెజార్టీ ఖాయం: రాజగోపాల్రెడ్డి
[ 05-05-2024]
భువనగిరి లోక్సభ నియోకవర్గంలో నాలుగు లక్షల మెజార్టీ తగ్గకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు -
ఆ ఎద్దడి మనకొద్దు.. అప్రమత్తతే ముద్దు
[ 05-05-2024]
ప్రస్తుతం బెంగళూరు నగర నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. -
ఆయకట్టులో ఆగని చోరీలు
[ 05-05-2024]
సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా యథేచ్ఛగా వారి పని చేసుకుంటూ పోతున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టొద్దు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
భానుడి ప్రతాపం.. బాతులకు తాపం
[ 05-05-2024]
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.దీంతో పక్షులు సేదతీరేందుకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. -
నేనేంటీ.. నాకింత విలువేంటి..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో పాటు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. -
నేటి నుంచి ఈవీఎంల కమీషనింగ్
[ 05-05-2024]
ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టమైన ఈవీఎంల కమీషనింగ్ (బ్యాలెట్ కాగితం అమర్చడం, నమూనా పోలింగ్) ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. -
6న నల్గొండలో నడ్డా సభ: సైదిరెడ్డి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. -
కొనసాగిన ఇంటి వద్ద పోలింగ్
[ 05-05-2024]
జిల్లాలో రెండు రోజులుగా ఇంటి వద్ద పోలింగ్ నిర్వహణను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు. -
రూ.2తో ఓటు సవాల్
[ 05-05-2024]
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం
[ 05-05-2024]
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని అక్కలదేవిగూడెంలో శనివారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్