పోరుబాట.. ఓటు మాట..!
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు.
భువనగిరిలోని అంబేడ్కర్ సెంటర్లో ప్రసంగిస్తున్న మాజీ సీఎం కేసీఆర్, చిత్రంలో ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
ఈనాడు, నల్గొండ - భువనగిరి, న్యూస్టుడే : ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. సాయంత్రం 7.10 గంటలకు భువనగిరికి చేరుకున్న ఆయనకు సాయిబాబా మందిరం వద్ద మహిళలు బోనాలు, నృత్యాలు, కోలాటాలతో స్వాగతం పలికారు. ఆదివాసీ నృత్యాలు, ముస్లింల వాయిద్యాలు (మర్ఫీ) అలరించాయి. లోక్సభ నియోజకవర్గంలోని వివిధ సెగ్మెంట్ల నుంచి సాయంత్రం నుంచే ప్రజలు, పార్టీ శ్రేణుల రాక కనిపించింది. కేసీఆర్ బస్సు ముందు కార్యకర్తలు బాణసంచా భారీగా కాల్చారు. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకోగా..మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ‘ఒకటే జననం ఒకటే మరణం’ పాటపాడి అలరించారు.
- మిర్యాలగూడ, సూర్యాపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్పై విరుచుకుపడ్డ కేసీఆర్ భువనగిరి రోడ్షోలో మాత్రం ప్రధానంగా భాజపాపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ఆ పార్టీ అభ్యర్థి, గతంలో భారాస నుంచి ఎంపీగా ఉన్న బూర నర్సయ్య ఈ ప్రాంతానికి ఏం చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని హామీల అమలుపై ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచాలంటే భారాసను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని కోరారు. ప్రధాని మోదీతో పోరాటమే తప్ప రాజీ లేదని స్పష్టం చేశారు. భువనగిరి పురపాలికలో భాజపా, కాంగ్రెస్ పొత్తును ప్రస్తావిస్తూ ఆ రెండు పార్టీలూ ఒకటేనని తెలిపారు.
- భువనగిరిలో మైనార్టీల ప్రాబల్యం అధికంగా ఉండటంతో వారిని ఆకట్టుకోవడానికి ఉర్దూలో మాట్లాడుతూ మద్దతు కోరారు. గతంలో వారికి ఉన్న పథకాలు, ప్రస్తుత ప్రభుత్వంలో అందుతున్న పథకాలను అడుగుతూ తేడాను గుర్తించాలన్నారు. తమది లౌకిక పార్టీ అని, ఇకముందూ అలానే ఉంటామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారాసను ఎందుకు గెలిపించాలో వివరించారు. ఈ సందర్భంగా ఇటీవల భారాస ఓడినా బాధ లేదని..పార్టీ శ్రేణులు, ప్రజల గుండెల్లా తానున్నానని వారికి భరోసా కల్పించారు.
- అంతకుముందు సూర్యాపేటలోని జగదీశ్రెడ్డి నివాసంలో బస చేసిన కేసీఆర్ను ఉదయం నుంచి వివిధ వర్గాల వారు కలిశారు. ఉమ్మడి జిల్లా నాయకులతో ప్రస్తుత పరిస్థితిపై ఆయన చర్చించినట్లు తెలిసింది. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే తప్ప బతుకులు బాగుపడవన్న నమ్మకంతో 15 ఏళ్లు తెగించి కేసీఆర్ కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాకారం చేశారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భానుడి వేడి..దొరకని నాడి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
ప్రచారం కన్నా... సమీక్షలే మిన్నా..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో ఏడు రోజులే గడువు ఉన్నా.. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం ఊపందుకోలేదు. -
మనమే కారణం.. మేల్కోకుంటే దారుణం
[ 05-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
అప్రమత్తతే శ్రీరామరక్ష
[ 05-05-2024]
మిర్యాలగూడ పట్టణంలో శనివారం దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. -
రైతు భరోసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
గంగా, సబర్మతి మాదిరిగా మూసీ ప్రక్షాళన
[ 05-05-2024]
ఈ ప్రాంత ప్రజలను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మూసీ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. గంగా, సబర్మతి నదుల్లాగా మూసీని కాలుష్యరహితంగా తయారు చేస్తామని భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. -
చుక్క నీరు కూడా వదులుకోబోం: మంత్రి ఉత్తమ్
[ 05-05-2024]
ప్రస్తుత ఎన్నికలు భారతదేశ దిశ, దశ మార్చేవని, ప్రతి ఓటరూ ఇది గుర్తించి ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. -
నాలుగు లక్షల మెజార్టీ ఖాయం: రాజగోపాల్రెడ్డి
[ 05-05-2024]
భువనగిరి లోక్సభ నియోకవర్గంలో నాలుగు లక్షల మెజార్టీ తగ్గకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు -
ఆ ఎద్దడి మనకొద్దు.. అప్రమత్తతే ముద్దు
[ 05-05-2024]
ప్రస్తుతం బెంగళూరు నగర నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. -
ఆయకట్టులో ఆగని చోరీలు
[ 05-05-2024]
సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా యథేచ్ఛగా వారి పని చేసుకుంటూ పోతున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టొద్దు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
భానుడి ప్రతాపం.. బాతులకు తాపం
[ 05-05-2024]
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.దీంతో పక్షులు సేదతీరేందుకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. -
నేనేంటీ.. నాకింత విలువేంటి..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో పాటు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. -
నేటి నుంచి ఈవీఎంల కమీషనింగ్
[ 05-05-2024]
ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టమైన ఈవీఎంల కమీషనింగ్ (బ్యాలెట్ కాగితం అమర్చడం, నమూనా పోలింగ్) ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. -
6న నల్గొండలో నడ్డా సభ: సైదిరెడ్డి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. -
కొనసాగిన ఇంటి వద్ద పోలింగ్
[ 05-05-2024]
జిల్లాలో రెండు రోజులుగా ఇంటి వద్ద పోలింగ్ నిర్వహణను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు. -
రూ.2తో ఓటు సవాల్
[ 05-05-2024]
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం
[ 05-05-2024]
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని అక్కలదేవిగూడెంలో శనివారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు