logo

యువకుడి బలవన్మరణం

పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.

Published : 26 Apr 2024 04:26 IST

కోరబోయిన కృష్ణ

వలిగొండ, న్యూస్‌టుడే: పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కోరబోయిన యాదయ్య- ఎల్లమ్మ దంపతుల ఏకైక కుమారుడు కృష్ణ(29) హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామంలో కొత్త ఇల్లు కట్టుకోవాలని తలచి శిథిలావస్థలో ఉన్న ఇంటిని కూల్చివేశారు. ఇంటి నిర్మాణానికి సరిపడా డబ్బులు లేక కలత చెంది మంగళవారం పురుగుమందు తాగి ఆపస్మారక స్థితికి చేరాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్‌ గురువారం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు