వార్డు సభ్యుడు..ఆపై ఏకంగా ఎమ్మెల్యే పదవి
వార్డు సభ్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే ఏకంగా ఎమ్మెల్యే పదవి వరించిన సంఘటన ఇది. రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన చల్లూరు పోచయ్య 1978 ప్రాంతంలో స్థానికంగా వార్డు సభ్యుడు
చల్లూరు పోచయ్య
వార్డు సభ్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే ఏకంగా ఎమ్మెల్యే పదవి వరించిన సంఘటన ఇది. రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన చల్లూరు పోచయ్య 1978 ప్రాంతంలో స్థానికంగా వార్డు సభ్యుడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈయన చదివింది కూడా పెద్దగా ఏమీలేదు. స్థానికంగా ఓ గురువువద్ద పెద్ద బాలశిక్షను పూర్తిచేసినట్లుగా అప్పట్లో తెలిపేవారు. అయితే బొందుగుల గ్రామానికి చెందిన ముక్క రాజమల్లయ్యకు ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలేరు ఎమ్మెల్యేగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలనే సంకల్పంతో కొందరు నాయకులతో కలిసి పోచయ్య హైదరాబాద్ వెళ్లారు. అధిష్ఠానం అప్పట్లో రాజమల్లయ్యకు పార్టీ టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉండటంతో రాత్రి కావడంతో వారంతా అక్కడే ఓ హోటల్లో బసచేశారు. తెల్లారి లేచి చూసేసరికి రాజమల్లయ్య హోటల్నుంచి వీరికి చెప్పకుండా వెళ్లి రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీచేయడానికి అంగీకరించినట్లుగా తెలిసింది. ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థి లేకుండా పోయారు. ఈ తరుణంలో పార్టీ నాయకత్వం చల్లూరు పోచయ్యకు ఇందిరా కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా ఖరారు చేసింది. అదృష్టవశాత్తు లభించిన అవకాశం వల్ల 1978లో ఎమ్మెల్యేగా బరిలో నిలిచి 35 వేల మెజార్టీతో గెలుపొందాడు పోచయ్య. అతి సాధారణ జీవితానికి అలవాటు పడిన చల్లూరు పోచయ్య తన పదవీ కాలం ముగిసినా రెండు దశాబ్దాలకు పైగా సైకిల్పైనే తిరిగేవారు. తదనంతరం 1982, 1987లో, 2002 సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. అనంతరం స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ సామాన్య జీవనం సాగించే క్రమంలో మూడేళ్ల క్రితం మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 04-05-2024]
భువనగిరి పట్టణంలో జిల్లా భారాస పార్టీ కార్యాలయంలో పట్టణ బూత్ కమిటీల సమావేశం ఏర్పాటు చేశారు. -
పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం యంత్రాల కేటాయింపు
[ 04-05-2024]
రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2,141 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం యంత్రాలను కేటాయించారు. -
చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి
[ 04-05-2024]
కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు బస్టాండ్ ఏరియాలో ప్రచారం చేపట్టారు. -
అభివృద్ధి వివరిస్తూ.. నాయకులను విమర్శిస్తూ..!
[ 04-05-2024]
మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
టెయిల్పాండ్ మట్టిపై అక్రమార్కుల కన్ను!
[ 04-05-2024]
మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నుంచి ఇటుక బట్టీలు, పలు ప్రైవేట్ భూముల్లో నింపేందుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. -
నేత..ఆత్మీయత
[ 04-05-2024]
అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ తేదీ మరో పదిరోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
మరో సందడి షురూ..!
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. -
పరిశ్రమల స్థాపనతో యువత, మహిళలకు ఉపాధి
[ 04-05-2024]
‘ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎంపీలు పట్టించుకోలేదు. -
హృదయాన్ని తాకిన అక్షరం
[ 04-05-2024]
మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి (18 నెలలు). వీరిది నిరుపేద కుటుంబం. -
కూటమి గెలుపునకు కృషి చేయాలి
[ 04-05-2024]
దేశంలో ఇండియా కూటమి గెలుపు కోసం మిత్రపక్షాలన్నీ కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. -
భాజపాకు చోటివ్వొద్దు: బీవీ రాఘవులు
[ 04-05-2024]
లౌకికవాదానికి, అభివృద్ధి మార్గానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు చొటివ్వొద్దని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలను కోరారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..!
[ 04-05-2024]
పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, సారూప్య దుస్తులు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి: చామల
[ 04-05-2024]
ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 04-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా నిర్వహించారు. -
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నం: మంత్రి ఉత్తమ్
[ 04-05-2024]
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, దొండపాడు, చిలుకూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!