దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి
అత్యవసర మోటార్ల నుంచి అప్రోచ్ కెనాల్లోకి విడుదలవుతున్న నీరు
పెద్దఅడిశర్లపల్లి, న్యూస్టుడే: నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. రూ.4 కోట్లతో నాగార్జునసాగర్ జలాశయంలో అత్యవసర మోటార్ల ఏర్పాటు పనులు చివరిదశకు చేరుకున్నాయి. వారం క్రితం యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించిన జలమండలి అధికారులు బుధవారం రాత్రి నిర్ణీత పది మోటార్లలో నాలుగు మోటార్ల నుంచి ప్రయోగాత్మకంగా నీటిని అప్రోచ్కెనాల్కు సరఫరా చేశారు. గురువారం మరో రెండు 120 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన మోటార్ల ఏర్పాటు పూర్తిచేసి 240 క్యూసెక్కుల నీటిని అదనంగా విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో మొత్తం 10 మోటార్లతో 900 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. మరోవైపు అప్రోచ్ కెనాల్లో నీటిమట్టం పెంచేందుకు సాగర్ జలాశయంలో అడ్డంగా కట్ట నిర్మాణానికి గ్యాబియన్స్, ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నారు. ఈ కట్టతో కాల్వలో 512 అడుగుల నీటిమట్టం నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచి విడుదలయ్యే కృష్ణాజలాలు 525 క్యూసెక్కులు ఏఎమ్మార్పీ ద్వారా కోదండాపురం మెట్రోవాటర్ ట్రీట్మెంటు ప్లాంటులో శుద్ధి చేసి 270 ఎంజీడీల రూపంలో జంటనగరాలలో 70 శాతం జనాభా దాహార్తి తీర్చుతాయి. నల్గొండ జిల్లాలోని ఉదయసముద్రం, ఆయిటిపాముల, యెడవల్లి, పెండ్లిపాకలలతో పాటు కోదండాపురం, స్వాములవారిలింగోటం మిషన్ భగీరథ ప్లాంటుల ద్వారా నిత్యం వేల సంఖ్యలోని గ్రామాల దాహం కేకలు తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లా, జంటనగరాల తాగునీటి సమస్య తీర్చడంలో కీలకమైన అత్యవసర మోటార్లను దశాబ్దకాలం క్రితం జలమండలి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ జలాశయంలో రూ.10 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా, జంటనగరాల్లో తాగునీటికి క్లిష్ట పరిస్థితుల్లో వీటిని తిరిగి అమర్చి, జలాశయానికి ఎగువ నుంచి వరదల సమయంలో తొలగించి ప్రత్యేకంగా భద్రపరిచి వినియోగిస్తుంటారు. 2019లో చివరి సారిగా వీటిని వినియోగించారు. వీటి ద్వారా 2017 సాగర్ జలాశయంలో అత్యంత దిగువకు డ్రెడ్జింగ్ చేపట్టి 500 అడుగుల లోతు నుంచి నీటిని సరఫరా చేసారు. ఈ పర్యాయం సైతం కృష్ణానదిలో వరదల పరిస్థితిని బట్టి వీటిని నడపనున్నామని జలమండలి అధికారులు తెలియజేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస దిల్లీలో లేదు గల్లీలో లేదు
[ 02-05-2024]
భారాస పార్టీ గల్లీలో లేదు దిల్లీలో లేదని ఆ పార్టీకి ఇక భవిష్యత్తు ఉండదని భాజపా భువనగిరి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. -
బకాయిదారులే తెరుచుకున్నాయ్!
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో 2022-23 రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం తీసుకుని కోట్ల రూపాయల బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న మిల్లర్లు ఉన్నారు. -
గుర్తుల గుబులు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగియడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. -
శిక్షణకు సిద్ధం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమం ఈ నెల 2 నుంచి 4 వరకు నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. -
ఓట్ల ఆధారంగానే పార్టీలకు గుర్తింపు
[ 02-05-2024]
మనం తరచూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు అంటూ వింటుంటాం. ఎన్నికల సమయంలో నేతలు ఎక్కువగా వీటిని ప్రస్తావిస్తుంటారు. జాతీయ పార్టీలు అంటే దిల్లీ కేంద్రంగా పనిచేస్తాయని, ప్రాంతీయ పార్టీలు స్థానిక సమస్యలను పరిష్కరిస్తుంటాయని చెబుతుంటారు. -
ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ
[ 02-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
సినీ ఫక్కీలో ఎల్లయ్య హత్య
[ 02-05-2024]
గత నెల 19న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు వచ్చి అదృశ్యమైనట్లు కేసు నమోదైన సూర్యాపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్యను కొంతమందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేట జిల్లాకు చెందిన తాడూరి శ్రీకాంతరాజు (చారి) ఒప్పుకొన్నారు. -
పోలీసులకూ అనుమతి లేదు సుమా..!
[ 02-05-2024]
మొత్తం ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలకపాత్ర. దాదాపు ఎన్నికల ప్రక్రియలో అన్ని చోట్లా వారి జోక్యం ఉంటుంది. ఎన్నికల ప్రచారాలకు, సభలకు, ర్యాలీలకు వారి అనుమతులు తప్పనిసరి. -
ఎండ వేఢీ.. చిక్కని ఓటరు నాడి
[ 02-05-2024]
శారీరక శ్రమకు అలవాటు పడి.. ప్రతి నిత్యం పనిలో నిమగ్నమై.. స్వేదం చిందించే కార్మికులను, కర్షకులను సైతం ఈ ఏడాది ఎండలు హడలెత్తిస్తున్నాయి. -
ఆయుధాలు అప్పగించారు..!
[ 02-05-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి నల్గొండ జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
ఆరో తరగతిలో వేయి పడగలు నవల చదివా
[ 02-05-2024]
మాది భువనగిరి. 12వ తరగతి వరకు అక్కడే చదివాను. ఆరో తరగతి చదివే రోజుల్లో వేసవి సెలవులొస్తే స్నేహితులు యంజాల గోపాల్, బుద్దగిరి లక్ష్మీనర్సయ్య, చల్ల కృష్ణలతో కలిసి నార్ఖాన్ బావికి ఈతకు వెళ్లేవాళ్లం. -
నీలగిరి.. నిప్పుల కొలిమి!
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారుతోంది. రోజురోజుకీ రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 02-05-2024]
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ప్రతిభా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ తెలిపారు. -
పేరు చెప్పనందుకు ఓటు కట్
[ 02-05-2024]
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక 1951లో ఓటర్ల నమోదు చేపట్టారు. అప్పట్లో 21 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కును రాజ్యాంగం కల్పించింది. -
పోలింగ్ కేంద్రాల్లో అధికారుల నంబర్లు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్ కేంద్రం, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. -
18 ఏళ్లకు ఓటుహక్కు ఎప్పుడు కల్పించారంటే..!
[ 02-05-2024]
1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారు. దీని ద్వారా 21 ఏళ్లు పైబడిన వారు ఓటు హక్కును వినియోగించుకునేవారు.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం