భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
సీపీఎం పోలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
భువనగిరిలో నిర్వహించిన ర్యాలీ
భువనగిరి గంజ్, భువనగిరి, న్యూస్టుడే: తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ నామినేషన్ దాఖలు కార్యక్రమం శుక్రవారం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగేకు ఎంపీ అభ్యర్థి జహంగీర్తో కలిసి నామపత్రాలను అందజేశారు. అనంతరం భువనగిరి పట్టణంలో ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండ్ నుంచి వేదిక వరకు ఎర్రదండు కదలింది. అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు నివాళులర్పించారు. ఏఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాఘవులు ప్రసంగిస్తూ.. భాజపా విజయాన్ని నిలువరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ విస్తృతంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించి భువనగిరి బరిలో దిగామన్నారు. దురదృష్టవశాత్తు అధికార కాంగ్రెస్, భారాసలు పరస్పర దూషణలో కొట్లాడుకుంటున్నాయే తప్ప భాజపా మతతత్వ ధోరణిని, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్ట లేకపోతున్నాయని విమర్శించారు. ఆ లోటును పూడ్చేందుకు తాము పెద్ద ఎత్తున్న పోరుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో భాజపాకు ఒక్క సీటు దక్కకుండా ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, భారాసలు కృషి చేయాలన్నారు. భారాస ఓడిపోయినందుకు కేసీఆర్ ప్రజలను నిందిస్తున్నారని ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును అగౌరవపర్చడం సరికాదన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీని బడేభాయ్ అని ఒకవైపు పొగుడుతూ భాజపాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నామని చెబుతుంటే ప్రజలు ఎలా విశ్వసిస్తారని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. భారాసపై ప్రజలకు నమ్మకం లేక కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని సీఎం రేవంత్రెడ్డి ఒంటెద్దు పోకడలతో ప్రజల సమస్యలు పట్టించుకోవడంలేదన్నారు. పార్టీలు మారుతున్న ఇతర పార్టీల అభ్యర్థులకంటే ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన జహంగీర్ను గెలిపించాలన్నారు. సీపీఎం రాష్ట్రకమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళనకు జహంగీర్ పోరాటం చేసినా భాజపా నిధులు ఇవ్వలేదన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. మతోన్మాద, అవకాశవాద పార్టీలను ఓడించి విప్లవ పార్టీని ఆదరించాలన్నారు. పార్టీకి చెందిన నాయకులు పలువురు సభలో విరాళాలు అందజేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన నిర్వహించిన సభలో నాయకులు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు, జి.జ్యోతి, జాన్వెస్లీ, పాలడుగు భాస్కర్, డీజీ నర్సింగ్రావు, మల్లు లక్ష్మి, పోతినేని సుదర్శన్, ఎండీ అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ, తుమ్మల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస దిల్లీలో లేదు గల్లీలో లేదు
[ 02-05-2024]
భారాస పార్టీ గల్లీలో లేదు దిల్లీలో లేదని ఆ పార్టీకి ఇక భవిష్యత్తు ఉండదని భాజపా భువనగిరి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. -
బకాయిదారులే తెరుచుకున్నాయ్!
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో 2022-23 రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం తీసుకుని కోట్ల రూపాయల బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న మిల్లర్లు ఉన్నారు. -
గుర్తుల గుబులు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగియడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. -
శిక్షణకు సిద్ధం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమం ఈ నెల 2 నుంచి 4 వరకు నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. -
ఓట్ల ఆధారంగానే పార్టీలకు గుర్తింపు
[ 02-05-2024]
మనం తరచూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు అంటూ వింటుంటాం. ఎన్నికల సమయంలో నేతలు ఎక్కువగా వీటిని ప్రస్తావిస్తుంటారు. జాతీయ పార్టీలు అంటే దిల్లీ కేంద్రంగా పనిచేస్తాయని, ప్రాంతీయ పార్టీలు స్థానిక సమస్యలను పరిష్కరిస్తుంటాయని చెబుతుంటారు. -
ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ
[ 02-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
సినీ ఫక్కీలో ఎల్లయ్య హత్య
[ 02-05-2024]
గత నెల 19న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు వచ్చి అదృశ్యమైనట్లు కేసు నమోదైన సూర్యాపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్యను కొంతమందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేట జిల్లాకు చెందిన తాడూరి శ్రీకాంతరాజు (చారి) ఒప్పుకొన్నారు. -
పోలీసులకూ అనుమతి లేదు సుమా..!
[ 02-05-2024]
మొత్తం ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలకపాత్ర. దాదాపు ఎన్నికల ప్రక్రియలో అన్ని చోట్లా వారి జోక్యం ఉంటుంది. ఎన్నికల ప్రచారాలకు, సభలకు, ర్యాలీలకు వారి అనుమతులు తప్పనిసరి. -
ఎండ వేఢీ.. చిక్కని ఓటరు నాడి
[ 02-05-2024]
శారీరక శ్రమకు అలవాటు పడి.. ప్రతి నిత్యం పనిలో నిమగ్నమై.. స్వేదం చిందించే కార్మికులను, కర్షకులను సైతం ఈ ఏడాది ఎండలు హడలెత్తిస్తున్నాయి. -
ఆయుధాలు అప్పగించారు..!
[ 02-05-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి నల్గొండ జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
ఆరో తరగతిలో వేయి పడగలు నవల చదివా
[ 02-05-2024]
మాది భువనగిరి. 12వ తరగతి వరకు అక్కడే చదివాను. ఆరో తరగతి చదివే రోజుల్లో వేసవి సెలవులొస్తే స్నేహితులు యంజాల గోపాల్, బుద్దగిరి లక్ష్మీనర్సయ్య, చల్ల కృష్ణలతో కలిసి నార్ఖాన్ బావికి ఈతకు వెళ్లేవాళ్లం. -
నీలగిరి.. నిప్పుల కొలిమి!
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారుతోంది. రోజురోజుకీ రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 02-05-2024]
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ప్రతిభా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ తెలిపారు. -
పేరు చెప్పనందుకు ఓటు కట్
[ 02-05-2024]
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక 1951లో ఓటర్ల నమోదు చేపట్టారు. అప్పట్లో 21 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కును రాజ్యాంగం కల్పించింది. -
పోలింగ్ కేంద్రాల్లో అధికారుల నంబర్లు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్ కేంద్రం, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. -
18 ఏళ్లకు ఓటుహక్కు ఎప్పుడు కల్పించారంటే..!
[ 02-05-2024]
1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారు. దీని ద్వారా 21 ఏళ్లు పైబడిన వారు ఓటు హక్కును వినియోగించుకునేవారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా