logo

మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందింది: భాజపా

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

Published : 23 Apr 2024 16:18 IST

భువనగిరి: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి జైశంకర్, డా. కే లక్ష్మణ్‌ అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన రోడ్ షోలో ప్రసంగించారు. భువనగిరి ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేస్తామని లక్ష్మణ్‌ అన్నారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు మోదీ అన్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాలని ఆరోపించారు. బూర నర్సయ్య మాట్లాడుతూ.. కోమటి రెడ్డి సోదరులు అమాయకులన్నారు. రుణ మాఫీ చేస్తా అంటున్నారు ముఖ్య మంత్రి రేవంత్ అది సాధ్యం అవుతుందా?అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు ఆరు మోసాలయ్యాయన్నారు. జై శంకర్ మాట్లాడుతూ.. లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తమకు ఉందన్నారు. 10 ఏళ్లు దేశం వెనకంజలో ఉంటే  మోదీ ముందుండి నడిపిస్తున్నారని వివరించారు. దేశం మోదీ హయాంలో అభివృద్ధి చెందిందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని