logo

పార్లమెంట్‌ నియోజకవర్గ సమస్యలపై గళం వినిపిస్తా: చామల కిరణ్ కుమార్‌ రెడ్డి

సీపీఐ మండల కౌన్సిల్ సభ్యులు, ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం భువనగిరి సాయి కన్వెన్షన్‌లో జరిగింది.

Updated : 04 May 2024 19:27 IST

భువనగిరి: సీపీఐ మండల కౌన్సిల్ సభ్యులు, ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం భువనగిరి సాయి కన్వెన్షన్‌లో జరిగింది. ఈ సమావేశంలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి, నాయకులు హాజరయ్యారు. ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇండియా కూటమి అభ్యర్థిగా తనను పార్లమెంటుకు పంపించాలని కోరారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సమస్యల గురించి పార్లమెంట్‌లో భువనగిరి గళం వినిపిస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు