logo

రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని అక్కలదేవిగూడెంలో శనివారం చోటుచేసుకుంది.

Published : 05 May 2024 04:27 IST

చివ్వెంల, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని అక్కలదేవిగూడెంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై బి.వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన మండవ బుచ్చయ్య(36) రోజు మాదిరిగా కల్లు గీసేందుకు తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వైపునకు వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుచ్చయ్యకు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి సోదరుడు జనార్దన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని