గంగా, సబర్మతి మాదిరిగా మూసీ ప్రక్షాళన
ఈ ప్రాంత ప్రజలను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మూసీ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. గంగా, సబర్మతి నదుల్లాగా మూసీని కాలుష్యరహితంగా తయారు చేస్తామని భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు.
క్యామ మల్లేష్
ఈనాడు, నల్గొండ- న్యూస్టుడే, భువనగిరి : ఈ ప్రాంత ప్రజలను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మూసీ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. గంగా, సబర్మతి నదుల్లాగా మూసీని కాలుష్యరహితంగా తయారు చేస్తామని భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. లోక్సభ పరిధిలోని చాలా సమస్యలకు గతంలో ఇక్కడి నుంచి ఎంపీలుగా పనిచేసిన కోమటిరెడ్డి సోదరులు, ప్రస్తుత భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ కారణమని ఆరోపించారు. తనని ఎంపీగా గెలిపిస్తే ఆరు నెలల్లోగా రైల్వే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
నాది ప్రజల ఎజెండా
నేను ప్రజల ఎజెండాతో ముందుకెళ్తున్నాను. లోక్సభ పరిధిలో ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయంటే దానికి కోమటిరెడ్డి సోదరులు, బూర నర్సయ్యలే కారణం. మూసీ కాలుష్యాన్ని ఎన్నికల నినాదంగా మార్చారు తప్పితే పరిష్కరించలేదు. నన్ను ఎంపీగా గెలిపించిన వెంటనే నా మొదటి ప్రాధాన్య అంశంగా మూసీ ప్రక్షాళనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధిస్తాను. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అపార అవకాశాలున్నా గత ఎంపీలు పట్టించుకోలేదు. పరిశ్రమల స్థాపనతో స్థానికులకు ఉపాధి కల్పిస్తాను.
డ్రైపోర్టు ఏర్పాటుతో ఉపాధి కల్పన
గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాను. డ్రైపోర్టు ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు అనేక ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మా ప్రభుత్వం అధికారంలో లేకపోయినా నన్ను ఎంపీగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నిర్మించే విధంగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాను.
ఆధ్యాతిక, పర్యాటక వలయంపై
నియోజకవర్గ పరిధిలో అనేక చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కట్టడాలున్నాయి. వీటిని పరిరక్షించాల్సి ఉంది. భువనగిరి కోట, యాదాద్రి, కొలనుపాక, రాచకొండ గుట్టలను కలిపి ఆధ్యాత్మిక, పర్యాటక సర్క్యూట్ను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాను. కేంద్రం మంజూరు చేసిన రూ.100 కోట్ల స్వదేశీ దర్శన్ నిధులు త్వరితగతిన విడుదలయ్యేందుకు చర్యలు తీసుకుంటాను.
కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే ఎంఎంటీఎస్లో జాప్యం..
ఎంఎంటీఎస్ మూడో దశకు ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఇప్పటి వరకు రాయగిరి వరకు రైలు ప్రయాణం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేది. ఎంపీగా ఎన్నికయిన వెంటనే రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మూడో దశను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాను. యాదాద్రి పుణ్యక్షేత్రానికి రద్దీ పెరుగుతున్నందున ఇక్కడి వరకు మెట్రో ప్రాజెక్టు ఆవశ్యకతను సైతం కేంద్రానికి వివరిస్తాను. పలు ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటూ సూపర్ఫాస్ట్ రైళ్లను భువనగిరి, ఆలేరు, జనగామల్లో ఆపేందుకు అధికారులతో మాట్లాడుతాను. నకిరేకల్, తుంగతుర్తి లాంటి సెగ్మెంట్లలో ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తాను.
జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణపై...
ఎన్హెచ్ఏఐ, రవాణా, పోలీసులు, జాతీయ రహదారుల సంస్థ నిపుణులతో సంయుక్తంగా సమావేశం నిర్వహించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తాను. ప్రమాదాల శాశ్వత నివారణకు బ్లాక్స్పాట్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్పాసుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి చర్యలు తీసుకుంటాం. యాదాద్రిలో భక్తుల రద్దీ పెరుగుతున్నందు వల్లా ఇప్పుడున్న నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి కోరుతాను.
ఎయిమ్స్లో పూర్తిస్థాయి సేవలకు చర్యలు
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేంద్రం ఎయిమ్స్ను మంజూరు చేస్తే మాజీ సీఎం కేసీఆర్ దానిని ఇక్కడి ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలని బీబీనగర్లో ఏర్పాటు చేయించారు. గెలిచిన వెంటనే ఎయిమ్స్లో పూర్తిస్థాయిలో సేవలు అందేలా కేంద్ర వైద్యశాఖ మంత్రిని కలుస్తాను. నా తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యంపైనే. వీటితో పాటూ ఇబ్రహీంపట్నంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, తుంగతుర్తి లాంటి వెనకబడిన ప్రాంతాల్లో ఐటీ కారిడార్ నెలకొల్పడానికి కృషి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
75 వేలు సైబర్ మోసం
[ 18-05-2024]
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో హెచ్.పి పెట్రోల్ బంక్ నిర్వాహకుడు రాచకొండ రామ కోటేశ్వరరావు నుంచి సైబర్ నేరగాళ్లు రూ.75వేలు చోరీ చేశారు. -
సేవా సంస్థల చేయూత అభినందనీయం
[ 18-05-2024]
సేవా సంస్థలు అందించే చేయూత బాధితులకు ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందని చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి అన్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
[ 18-05-2024]
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
కార్పొరేట్ వాకిటకు..సర్కారు సౌరభం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు సహకారం అందిస్తోంది. -
పరిశ్రమలు 900.. అధికారులు ఐదుగురు
[ 18-05-2024]
రసాయన, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. -
ప్రముఖుల పల్లెల్లో..ప్రజాస్వామ్యం మురిసె
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రముఖుల పల్లెల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. ఈ గ్రామాలకు చెందిన నేతలు ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా సేవలు అందించడంతో పాటు ఇతర ముఖ్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా పల్లెవాసులు వారిని ప్రోత్సహించారు. -
చలో.. నెల్లిబండ గట్టు జాతర
[ 18-05-2024]
వందల ఏళ్ల చరిత్ర.. రెండేళ్లకోసారి జాతర.. వేలాది మంది భక్తుల రాక.. ఉమ్మడి జిల్లాలో దురాజ్పల్లి పెద్దగట్టు తర్వాతి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న చిన్నగట్టు జాతరకు నెల్లిబండ ముస్తాబైంది. -
పట్టభద్రులకు పోల్ చిట్టీలు
[ 18-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభించేనో?
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల క్రతువు ఇటీవలే ముగిసింది. అందరి దృష్టి భువనగిరి లోక్సభ పైనే ఉంది. ఇక్కడ గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఇది ఎవరికి లాభిస్తుందనే విషయమై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. అందనున్న ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
సాధారణ సేవలకు మాత్రమే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖానాల్లో అదనంగా ఏడు రకాల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమ్మ అంత్యక్రియలకు అడ్డంకిగా ఆస్తి
[ 18-05-2024]
అమ్మ అంత్యక్రియలకు ఆస్తి పంపకం అడ్డంకిగా మారిన ఉదంతమిది. కన్నతల్లి అంత్యక్రియలు తమ బాధ్యత అనే విషయాన్ని మరిచి ఆ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆస్తి పంపకం విషయమై గ్రామపెద్దలతో ఎడతెగని చర్చలు జరిపారు -
ఆ చేపల పులుసు..మనసులు గెలుచు
[ 18-05-2024]
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: బూర
[ 18-05-2024]
పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరారు -
కలవరపెడుతున్న క్షయ
[ 18-05-2024]
క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. -
ఈసారైనా సీసీ లైనింగ్కు గ్రీన్సిగ్నల్ వచ్చేనా..?
[ 18-05-2024]
నల్గొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) ప్రధాన కాల్వకు సిమెంటు కాంక్రీటు(సీసీ) లైనింగ్ చేసే పనులకు ఈ సారైనా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా..
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్