గతమంతా ఘనం.. ఇప్పుడంతా ధనం
ప్రధాన పార్టీలు నిర్వహించే ర్యాలీలు, కూడళ్ల సమావేశాలకు జనం తరలింపు పెద్ద తలనొప్పిగా మారుతోంది. నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో కూడళ్ల జాతరకు జనం స్వచ్ఛందంగా రావాలంటే కష్టమే. భువనగిరి, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల పరిస్థితి ఇదే.
నాంపల్లి, న్యూస్టుడే: ప్రధాన పార్టీలు నిర్వహించే ర్యాలీలు, కూడళ్ల సమావేశాలకు జనం తరలింపు పెద్ద తలనొప్పిగా మారుతోంది. నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో కూడళ్ల జాతరకు జనం స్వచ్ఛందంగా రావాలంటే కష్టమే. భువనగిరి, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల పరిస్థితి ఇదే. జనం తరలింపు బాధ్యత స్థానిక నేతలదే. వాహనాలు పెట్టి జనాన్ని తరలించడమే కాకుండా.. తమ పనులు మానుకొని వస్తున్నందుకు సాయంకాలానికి వారికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. లేదంటే మరోసారి సమావేశానికి పిలిచినా ముఖం చాటేస్తున్నారు. ఎప్పుడూ ఇచ్చే డబ్బులు కాకుండా అదనంగా ఇవ్వాలని పలువురు చోటామోటా నేతల వద్ద డిమాండ్ చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఆరేడు గంటలు అక్కడ నిరీక్షించాలంటే ఆ మాత్రం ఇచ్చుకోవాల్సిందేనని చెబుతున్నారు.
కాలు బయట పెట్టాలంటే..
గతంలో పార్టీలకు అంకితభావంతో పనిచేసే నాయకులు ఉండేవారు. పార్టీలను అంటిపెట్టుకొని అవసరమైతే తమ జేబుల నుంచి ఖర్చు పెట్టి నాయకులను గెలిపించుకునేవారు. రాను రానూ రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. ప్రజలు, కార్యకర్తల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ప్రస్తుతం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు చాలా తక్కువ. నీ పార్టీ ప్రచారానికి వస్తే నాకేంటి.. అనే ధోరణి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. అభ్యర్థుల నామినేషన్ నాటి నుంచి ఎన్నికల సభలు, రోడ్ షోలు, ఇతర అన్ని ప్రచార కార్యక్రమాలకు జనసమీకరణ అభ్యర్థులకు కత్తిమీదసామే అవుతోంది. భువనగిరి, నల్గొండ లోక్సభ స్థానాలకు అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్షోలు, సభలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్కో లోక్సభ స్థానంలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్లు, మున్సిపాలిటీలు, మండలాలు, ఇలా అన్ని గ్రామాల్లో ఇంటింటి ప్రచారానికే 100 నుంచి 200 మంది వరకు అవసరం. రోజంతా ప్రచారం నడవాలంటే చేతిలో డబ్బులు పడాల్సిందే. లేదంటే కాలు కదిపేది లేదంటున్నారు.
కింది స్థాయి నేతలే నుంచే..
జన సమీకరణలో చోటామోటా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేసే నేతలను అభ్యర్థులు తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. ఇందుకు నేత స్థాయిని బట్టి ముడుపులు ముడుతున్నాయి. ర్యాలీలు, ప్రచారానికి కూలీలు, గ్రామాల్లో ఉన్న వారిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ముఖ్యంగా యువతను తరలించడానికి ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఠారెత్తిస్తున్న ఎండలకు యువకులు మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. బైకు ర్యాలీలకు పెట్రోల్, భోజనాలు, సాయంత్రం పార్టీలకు ఖర్చు రాజకీయ నేతలే భరించాలి. ఉదయం రెండు గంటలు.. సాయంత్రం రెండు గంటలు అభ్యర్థుల వెంట ప్రచారంలో పాల్గొనాలంటే భోజనం ఇతర ఖర్చులతో పాటు రూ.500-1000 వరకు ఇవ్వాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. ఈ మాత్రం ఇవ్వకుండా ఎండలో ఎలాతిరుగుతారని కింది స్థాయి నేతలూ అభ్యర్థులను ఖర్చుకు మెప్పించక తప్పని స్థితి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్పొరేట్ వాకిటకు..సర్కారు సౌరభం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు సహకారం అందిస్తోంది. -
పరిశ్రమలు 900.. అధికారులు ఐదుగురు
[ 18-05-2024]
రసాయన, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. -
ప్రముఖుల పల్లెల్లో..ప్రజాస్వామ్యం మురిసె
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రముఖుల పల్లెల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. ఈ గ్రామాలకు చెందిన నేతలు ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా సేవలు అందించడంతో పాటు ఇతర ముఖ్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా పల్లెవాసులు వారిని ప్రోత్సహించారు. -
చలో.. నెల్లిబండ గట్టు జాతర
[ 18-05-2024]
వందల ఏళ్ల చరిత్ర.. రెండేళ్లకోసారి జాతర.. వేలాది మంది భక్తుల రాక.. ఉమ్మడి జిల్లాలో దురాజ్పల్లి పెద్దగట్టు తర్వాతి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న చిన్నగట్టు జాతరకు నెల్లిబండ ముస్తాబైంది. -
పట్టభద్రులకు పోల్ చిట్టీలు
[ 18-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభించేనో?
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల క్రతువు ఇటీవలే ముగిసింది. అందరి దృష్టి భువనగిరి లోక్సభ పైనే ఉంది. ఇక్కడ గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఇది ఎవరికి లాభిస్తుందనే విషయమై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. అందనున్న ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
సాధారణ సేవలకు మాత్రమే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖానాల్లో అదనంగా ఏడు రకాల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమ్మ అంత్యక్రియలకు అడ్డంకిగా ఆస్తి
[ 18-05-2024]
అమ్మ అంత్యక్రియలకు ఆస్తి పంపకం అడ్డంకిగా మారిన ఉదంతమిది. కన్నతల్లి అంత్యక్రియలు తమ బాధ్యత అనే విషయాన్ని మరిచి ఆ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆస్తి పంపకం విషయమై గ్రామపెద్దలతో ఎడతెగని చర్చలు జరిపారు -
ఆ చేపల పులుసు..మనసులు గెలుచు
[ 18-05-2024]
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: బూర
[ 18-05-2024]
పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరారు -
కలవరపెడుతున్న క్షయ
[ 18-05-2024]
క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. -
ఈసారైనా సీసీ లైనింగ్కు గ్రీన్సిగ్నల్ వచ్చేనా..?
[ 18-05-2024]
నల్గొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) ప్రధాన కాల్వకు సిమెంటు కాంక్రీటు(సీసీ) లైనింగ్ చేసే పనులకు ఈ సారైనా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా..
తాజా వార్తలు (Latest News)
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్