సామాజిక వేదికలు.. ప్రచారాస్త్రాలు
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు నానా తిప్పలు పడాల్సి వచ్చేది. బరిలో ఉన్న అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ తమ నియోజకవర్గ ప్రజలకు తెలిసేది కాదు.
రాజపేట, ఆలేరు, న్యూస్టుడే: ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు నానా తిప్పలు పడాల్సి వచ్చేది. బరిలో ఉన్న అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ తమ నియోజకవర్గ ప్రజలకు తెలిసేది కాదు. ప్రస్తుతం కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. అరచేతిలో చరవాణి ఉన్న ప్రతి ఒక్కరూ క్షణాల్లో అన్నీ తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాల్లోని ప్రధాన పార్టీల అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు.
సామాజిక మాధ్యమాలే కీలకం..
ప్రస్తుత రాజకీయాల్లో సామాజిక మాధ్యమాలు అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. నాయకులు, వారి అనుచరులు ఎక్స్ ఖాతాను తెరవడంతో పాటు అభిమాన నేతలను అనుసరిస్తుంటారు. చాలా మంది నాయకులు, ప్రజా ప్రతినిధులకు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి ఉండటం గమనార్హం. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం కాసేపు విరామం తీసుకుని సాయంత్రం నుంచి మళ్లీ ప్రచారం చేస్తున్నారు. రహదారులు, గల్లీల్లో మైకుల మోత ఒక పక్క మోగుతుంటే, మరో వైపు సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర వాటిలో ప్రచారం గుప్పిస్తున్నారు. పార్టీ రూపొందించిన మ్యానిఫెస్టో వివరించడం, ప్రత్యర్థులకు దీటుగా సమాధానం చెప్పడానికి సామాజిక వేదికలను వినియోగించుకుంటున్నారు. కొందరు అభ్యర్థులు రూపొందించిన యూట్యూబ్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. వివాదాస్పద వీడియోలు, చిత్రాలు వేరేవారికి పంపితే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
పల్లెల్లో వాట్సప్ గ్రూపుల గోల..
ప్రతి గ్రామంలో వాట్సప్ గ్రూపులు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో సమాచారం చేరవేయడానికి లెక్కలేనన్ని కొత్త గ్రూపులు పుట్టుకొస్తున్నాయి. సమావేశం, ప్రచారం ఉందంటే గ్రూపులో పోస్టు చేస్తున్నారు. నిమిషాల వ్యవధిలో అందరూ ఒకే దగ్గరకు చేరుకుంటున్నారు. ప్రధాన పార్టీలన్నింటికీ గ్రూపులతోపాటు గ్రామం, మండలం, పట్టణం, జిల్లాల గ్రూపులు ఏర్పాటయ్యాయి. జన సమీకరణతో పాటు అదే సమయానికి కార్నర్ మీటింగ్, రోడ్షోలు, ఇంటింటి ప్రచారం, క్లస్టర్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించడానికి ఈ గ్రూపులు దోహదపడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెట్రోల్ బంక్లో లారీలో మంటలు
[ 19-05-2024]
భువనగిరిలోని ఓ పెట్రోల్ బంక్లో లారీలో మంటలు చెలరేగాయి. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. -
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
[ 19-05-2024]
ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. -
ప్రాదేశిక సమరంపై స్పష్టత కరవు
[ 19-05-2024]
జిల్లా, మండల పరిషత్తుల ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు గడువులోపు అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఫలితంగా గ్రామ పంచాయతీలకు నియమించిన మాదిరిగానే జిల్లా, మండల పరిషత్తులకు ప్రత్యేకపాలన అధికారులను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
పీడీఎస్ బియ్యం వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదు
[ 19-05-2024]
పెద్దవూర సమీపంలో పీడీఎస్ బియ్యం దందా వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పెద్దవూర ఎస్ఐ వీరబాబు తెలిపారు. వీరిలో నలుగురిని అరెస్టు చేసినట్లు, మిగతా వారు పరారీలో ఉన్నారని శనివారం రాత్రి పత్రికా ప్రకటనలో పోలీసులు వెల్లడించారు. -
ఆరు నెలల్లో సూపర్స్పెషాలిటీ వైద్యసేవలు
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి స్థాయి మరింత పెరగనుంది. ఎస్సెల్బీసీ ప్రాంతంలో రూ.120 కోట్లతో 37 ఎకరాల్లో నిర్మిస్తున్న వైద్యకళాశాల పనులు సెప్టెంబరు లోపు పూర్తవుతాయని టీఎస్ఎంఐడీసీ అధికారులు చెబుతున్నారు. -
బడి.. పూర్వపు ఒరవడి!
[ 19-05-2024]
సీఎం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 చోట్ల పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించగా.. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 24, భువనగిరి, సూర్యాపేట జిల్లాలో పలు గ్రామాల్లో పాఠశాలలు ప్రారంభించనున్నారు. -
వనమాల.. బ్యాడ్మింటన్లో భళా!
[ 19-05-2024]
మిర్యాలగూడ పట్టణానికి చెందిన వనమాల శ్రీకాంత్- భవానీల కుమారుడు శశాంక్ చిన్నతనం నుంచి బ్యాడ్మింటన్లో అద్భుత ప్రతిభ కనబరచడంతో శిక్షకుడు మారబోయిన రామకృష్ణ సూచన మేరకు హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక గోపిచంద్ అకాడమీలో చేర్పించారు. -
‘అద్విత’ంగా ప్రతిభ చూపి..!
[ 19-05-2024]
మిర్యాలగూడ పట్టణానికి చెందిన బిక్కుమళ్ల అద్విత్ కృష్ణ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 275 ర్యాంకు సాధించాడు. పట్టణంలోని కేఎల్ఎన్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బిక్కుమళ్ల కిరణ్కుమార్, శైలజ దంపతుల కుమారుడు అద్విత్ కృష్ణ స్థానికంగా కళాశాలలో ఇంటర్ బైపీసీ 958 మార్కులతో పూర్తిచేశాడు. -
ఈతకు వెళ్లిన బాలుడి గల్లంతు
[ 19-05-2024]
నీటి ప్రమాదాలు జరిగినప్పుడు మరణించొద్దనే ఆలోచనతో తండ్రి తన పిల్లలకు మూడు రోజులుగా ఈత నేర్పిస్తున్నాడు. ఈత వచ్చిందనే సంతోషంలో తండ్రికి తెలియకుండా మళ్లీ బావిలోకి దూకిన బాలుడు గల్లంతైన ఘటన శనివారం సాయంత్రం తిరుమలగిరిలో జరిగింది. -
పంచనారసింహులకు భక్తుల మొక్కు పూజలు
[ 19-05-2024]
పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సుప్రభాతం నిర్వహించిన పూజారులను బిందెతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి. -
కొత్తగా 24 ప్రాథమిక పాఠశాలలు
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలు లేని గ్రామపంచాయతీల్లో నూతనంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కార్యరూపం దాల్చనుంది. జిల్లా వ్యాప్తంగా 421 గ్రామపంచాయతీలు ఉండగా 24 గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు లేనట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్