ఆమె ఇంటికే పరిమితమైతే..అంతే..!
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలు మార్చే శక్తి మహిళా ఓటర్లపైనే ఉంది. అతివలు తలచుకుంటే అందలం ఎక్కడం పక్కా అని తెలుస్తుంది.
మహిళల పోలింగ్ శాతం తగ్గితే ఫలితాలపై ప్రభావం
ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తగ్గిన అతివల ఓటింగ్
రాజపేట, భువనగిరి, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలు మార్చే శక్తి మహిళా ఓటర్లపైనే ఉంది. అతివలు తలచుకుంటే అందలం ఎక్కడం పక్కా అని తెలుస్తుంది. ముఖ్యంగా భువనగిరి, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లకంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉండటం గమనార్హం. అంతా బాగానే ఉన్నా దేశంలో గడిచిన రెండు విడతల్లో జరిగిన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే మహిళా పోలింగ్ తక్కువేనని తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ తలెత్తితే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. నల్గొండ, భువనగిరి లోక్సభ పరిధిలో మొత్తం 35,17,658 ఓట్లుండగా.. ఇందులో మహిళా ఓటర్లు 17,80,788 మంది ఉన్నారు. నల్గొండ లోక్సభ పరిధిలో 17,18,954 ఓట్లకుగానూ 8,76,538 మహిళా ఓటర్లున్నారు. భువనగిరి లోక్సభ పరిధిలో 17,98,704 ఓట్లకుగానూ 9,04,250 మంది మహిళా ఓటర్లు ఉండటం గమనార్హం.
ఇటీవల పోలింగ్ సరళిని పరిశీలిస్తే..
దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన మొదటి, రెండు విడతల్లో జరిగిన లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తే ఓటు హక్కు వినియోగంపై మహిళలు అంతగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ఈ విషయమై కొన్ని రాష్ట్రాల పోలింగ్ సరళిని పరిశీలిస్తే అర్ధం అవుతోంది. మిజోరంలో పురుష ఓటర్ల పోలింగ్ శాతం 58.1 ఉండగా మహిళా ఓటర్ల పోలింగ్ శాతం 55.7 ఉంది. రాజస్థాన్లో పురుషుల పోలింగ్ 62.2 ఉంటే మహిళల పోలింగ్ 60.5 ఉందని ఎన్నికల సంఘం తెలిపిన గణాంకాలు వివరిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో 65.3, 61.3 మహిళల పోలింగ్ ఉంది. మహారాష్ట్రలో 65.9 పురుషుల, 60.7 మహిళల పోలింగ్ ఉంది. ఛత్తీస్గఢ్లో 75 శాతం పురుషుల పోలింగ్ శాతం ఉంటే 73.5 శాతం మహిళా ఓట్ల పోలింగ్ శాతం ఉండటం గమనార్హం.
మండే ఎండలూ ఒకింత కారణం..
ముఖ్యంగా అభ్యర్థుల ప్రచారం, సభలు, సమావేశాల్లోనూ మహిళలు అంతగా ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణం మండే ఎండలనే తెలుస్తోంది. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకుని, పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం పోలింగ్ జరిగే సమయాన్ని అదనంగా ఒక గంటపాటు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. మండిపోతున్న ఎండల కారణంగా పోలింగ్ ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఎక్కువ శాతం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదయం వేళల్లో మహిళలు వంట ఇతర ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండనున్నందున సాయంత్రం పోలింగ్కే మహిళామణులు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెట్రోల్ బంక్లో లారీలో మంటలు
[ 19-05-2024]
భువనగిరిలోని ఓ పెట్రోల్ బంక్లో లారీలో మంటలు చెలరేగాయి. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. -
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
[ 19-05-2024]
ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. -
ప్రాదేశిక సమరంపై స్పష్టత కరవు
[ 19-05-2024]
జిల్లా, మండల పరిషత్తుల ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు గడువులోపు అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఫలితంగా గ్రామ పంచాయతీలకు నియమించిన మాదిరిగానే జిల్లా, మండల పరిషత్తులకు ప్రత్యేకపాలన అధికారులను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
పీడీఎస్ బియ్యం వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదు
[ 19-05-2024]
పెద్దవూర సమీపంలో పీడీఎస్ బియ్యం దందా వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పెద్దవూర ఎస్ఐ వీరబాబు తెలిపారు. వీరిలో నలుగురిని అరెస్టు చేసినట్లు, మిగతా వారు పరారీలో ఉన్నారని శనివారం రాత్రి పత్రికా ప్రకటనలో పోలీసులు వెల్లడించారు. -
ఆరు నెలల్లో సూపర్స్పెషాలిటీ వైద్యసేవలు
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి స్థాయి మరింత పెరగనుంది. ఎస్సెల్బీసీ ప్రాంతంలో రూ.120 కోట్లతో 37 ఎకరాల్లో నిర్మిస్తున్న వైద్యకళాశాల పనులు సెప్టెంబరు లోపు పూర్తవుతాయని టీఎస్ఎంఐడీసీ అధికారులు చెబుతున్నారు. -
బడి.. పూర్వపు ఒరవడి!
[ 19-05-2024]
సీఎం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 చోట్ల పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించగా.. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 24, భువనగిరి, సూర్యాపేట జిల్లాలో పలు గ్రామాల్లో పాఠశాలలు ప్రారంభించనున్నారు. -
వనమాల.. బ్యాడ్మింటన్లో భళా!
[ 19-05-2024]
మిర్యాలగూడ పట్టణానికి చెందిన వనమాల శ్రీకాంత్- భవానీల కుమారుడు శశాంక్ చిన్నతనం నుంచి బ్యాడ్మింటన్లో అద్భుత ప్రతిభ కనబరచడంతో శిక్షకుడు మారబోయిన రామకృష్ణ సూచన మేరకు హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక గోపిచంద్ అకాడమీలో చేర్పించారు. -
‘అద్విత’ంగా ప్రతిభ చూపి..!
[ 19-05-2024]
మిర్యాలగూడ పట్టణానికి చెందిన బిక్కుమళ్ల అద్విత్ కృష్ణ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 275 ర్యాంకు సాధించాడు. పట్టణంలోని కేఎల్ఎన్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బిక్కుమళ్ల కిరణ్కుమార్, శైలజ దంపతుల కుమారుడు అద్విత్ కృష్ణ స్థానికంగా కళాశాలలో ఇంటర్ బైపీసీ 958 మార్కులతో పూర్తిచేశాడు. -
ఈతకు వెళ్లిన బాలుడి గల్లంతు
[ 19-05-2024]
నీటి ప్రమాదాలు జరిగినప్పుడు మరణించొద్దనే ఆలోచనతో తండ్రి తన పిల్లలకు మూడు రోజులుగా ఈత నేర్పిస్తున్నాడు. ఈత వచ్చిందనే సంతోషంలో తండ్రికి తెలియకుండా మళ్లీ బావిలోకి దూకిన బాలుడు గల్లంతైన ఘటన శనివారం సాయంత్రం తిరుమలగిరిలో జరిగింది. -
పంచనారసింహులకు భక్తుల మొక్కు పూజలు
[ 19-05-2024]
పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సుప్రభాతం నిర్వహించిన పూజారులను బిందెతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి. -
కొత్తగా 24 ప్రాథమిక పాఠశాలలు
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలు లేని గ్రామపంచాయతీల్లో నూతనంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కార్యరూపం దాల్చనుంది. జిల్లా వ్యాప్తంగా 421 గ్రామపంచాయతీలు ఉండగా 24 గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు లేనట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్