అగ్రనేతలొస్తున్నారు..!
మరో రెండు రోజుల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది.ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి.
నేడు భువనగిరికి అమిత్షా, 10న నల్గొండకు ఖర్గే రాక
ఈనాడు, నల్గొండ : మరో రెండు రోజుల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది.ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. భాజపా నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం చేయగా..కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి ప్రచారం చేశారు. భారాస బస్సుయాత్రను మాజీ సీఎం కేసీఆర్ మిర్యాలగూడ నుంచే ప్రారంభించి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. చివరి దశలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపా ఆ పార్టీ కేంద్ర అగ్రనేతలను ప్రచారానికి రప్పిస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది.
- భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్షా నేడు భువనగిరిలో ప్రచారం చేయనున్నారు. పురపాలిక పరిధి రాయిగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఉదయం 11 గంటలకు సభకు చేరుకొని 12 గంటల వరకు సభలో పాల్గొంటారు. ప్రధానంగా తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, జనగామ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. అమిత్ షా రాక నిమిత్తం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్తో పాటూ రహదారి మార్గాన్ని కేంద్ర బలగాలు బుధవారం పరిశీలించాయి. సభ ఏర్పాట్లను బూర నర్సయ్యతో పాటూ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ తదితరులు పరిశీలించారు. 10న సూర్యాపేటలో నిర్వహించే భాజపా రోడ్షో, కార్నర్ మీటింగ్కు ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు హాజరవుతారని లోక్సభ అభ్యర్థి సైదిరెడ్డి ‘ఈనాడు’కు వెల్లడించారు.
- నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 10న నల్గొండకు రానున్నారు. మర్రిగూడ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. సభను విజయవంతం చేయాలని.. నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఎక్కవ మెజార్టీ వచ్చేలాగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. ఈ నెల 11న భువనగిరికి ప్రియాంక గాంధీ వస్తారని పార్టీ వర్గాలు ప్రాథమికంగా చెబుతున్నా ఇంకా ఖరారు కాలేదని అధికార పార్టీ వర్గాలు వెల్లడించాయి.
- చివరి రోజు ప్రచారంలో భాగంగా ఈ నెల 11న నల్గొండలో నిర్వహించే కార్నర్ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్, జగదీశ్రెడ్డి పాల్గొంటారని ప్రాథమిక సమాచారం. ఈ పర్యటనపై నేడు స్పష్టత రానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. భువనగిరిలో నిర్వహించే ప్రచారానికి మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉందని తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!