పెద్దాసుపత్రి.. సేవల్లో ఏదీ దీప్తి!
మా పాపకు జ్వరం.. దానికి తోడు వాంతులతో నీరసంగా ఉండటంతో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కందుకూరు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఓ వైద్యుడు పరీక్షించి.. పైన వార్డులో అడ్మిట్ చేయించారు.
వేధిస్తున్న కీలక వైద్యుల కొరత
మా పాపకు జ్వరం.. దానికి తోడు వాంతులతో నీరసంగా ఉండటంతో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కందుకూరు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఓ వైద్యుడు పరీక్షించి.. పైన వార్డులో అడ్మిట్ చేయించారు. ఆ రోజు రాత్రి జ్వరంగా ఉందని నర్సులకు చెబితే ఓ ఇంజక్షన్ వేశారు. ఇంకెవరు మమ్మల్ని పట్టించుకోలేదు. శనివారం తెల్లవారుజామున పాప చనిపోయిందని చెప్పారు. వైద్యులు సక్రమంగా పట్టించుకుని ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది.
చిన్నారి తల్లి ఆదిలక్ష్మి, మేనమామ నారాయణ
పాము కాటుకు గురై రాత్రి పది గంటల సమయంలో ఏరియా ఆసుపత్రికి వెళితే... ఆ సమయంలో అత్యవసరం అందాల్సిన వైద్య సేవలు సక్రమంగా అందలేదు. ఒంగోలు రిమ్స్కు సిఫార్సు చేశారు. అక్కడికి వెళ్లేలోపు మా బంధువు మృతి చెందాడు.
జనవరి 25న పాము కాటుతో మృతి చెందిన మణికంఠారెడ్డి బంధువుల ఆరోపణ.
తొక్కిసలాటలో కొందరు మృతి చెందారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కొందరిని ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ తగినంత మంది వైద్య సిబ్బంది, వసతులు ఉంటే.. అంతమంది చనిపోయి ఉండేవారు కాదు..
సంఘటనపై విచారణకు వచ్చిన ఏకసభ్య కమిషన్కు సీనియర్ సిటిజన్ వాంగ్మూలం.
ఆసుపత్రిలో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్ మెడిసిన్ ఒకరు. గైనకాలజీలో ఇద్దరు వైద్యులు లేరు. మత్తు వైద్యం కోసం రూ. 16 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. రోజు రోజుకూ ఓపీలు పెరుగుతున్నాయి. వైద్యులు కొరత ఉంది. ఉన్నవారిపైనే ఒత్తిడి అధికమవుతోంది.
ఏరియా ఆసుపత్రిలో పనిచేసే ఓ వైద్యుడి ఆవేదన.
కందుకూరు ప్రాంతీయ ఆసుపత్రి
కందుకూరు పట్టణం, న్యూస్టుడే: కందుకూరు ఏరియా ఆసుపత్రి.. పేరుకు పెద్ద ఆసుపత్రి.. రోగులకు అందుతున్న సేవలు మాత్రం అంతంత మాత్రమే.. ఆపత్కాలంలో.. అత్యవసరమై వెళ్లిన వారికి సరైన వైద్యం అందడం లేదని రోగులు, వారి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. సుమారు 11 మండలాలకు వంద పడకల ఆసుపత్రిగా ఉన్నా.. వైద్యుల కొరత, సిబ్బంది నిర్లక్ష్యం తదితరాలతో ఇటీవల విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం నాడు-నేడు కింద ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నా.. ఆచరణలో సేవలు శూన్యమన్న అపవాదు నెలకొంది.
కీలక పోస్టులు ఖాళీ..
ఆసుపత్రి.. 1999లో వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెంది.. కొన్నేళ్లు ఓ మోస్తరుగానే సేవలందించింది. అనంతరం ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకొచ్చి వసతులు, వైద్య పరికరాలు సమకూర్చడం.. వైద్యుల నియామకంతో రోగుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రోజుకు సుమారు 400కుపైగా ఓపీ, 100 నుంచి 120 వరకు ఇన్ పేషంట్లు ఉంటున్నారు. సాధారణ జ్వరాలు, ప్రసూతి, చిన్న పిల్లల వైద్య సేవల కోసం ఆసుపత్రికి అధికంగా వస్తుంటారు. అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 24 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా- కీలకమైన 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయిదుగురు సివిల్ సర్జన్ స్పెషలిస్టులు ఉండాల్సి ఉండగా- 2 పోస్టులు ఖాళీ.. ఒకరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. డిప్యూటీ సివిల్ సర్జన్, రేడియాలజీ, సీఎస్ ఆర్ఎంవో, డ్యూటీ డాక్టర్(డీడీఎంవో), అనస్థీషియన్తో పాటు కీలకమైన జనరల్ సర్జన్ పోస్టు ఖాళీగా ఉంది. ఆసుపత్రి అడ్మిన్, కార్యాలయ సూపరింటెండెంట్ పోస్టులదీ అదే పరిస్థితి అని సమాచారం. ఈ క్రమంలో రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, ఇతర చికిత్స కోసం వచ్చే వారికి సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు సేవలందిస్తుండటం గమనార్హం. అత్యవసర సమయాల్లో వారే వైద్యులుగా మారి.. కుట్లు వేయడం.. కట్లు కట్టడం చేస్తున్నారు.
ప్రాథమిక చికిత్సలకే పరిమితం
ప్రస్తుతం ఆసుపత్రిలో ఇద్దరు చిన్నపిల్లల వైద్యులు ఉండగా- రోజుకు 60 నుంచి 70 వరకు ఓపీ, 20 నుంచి 30 వరకు ఇన్ పేషంట్లు ఉంటున్నారు. వీరిని ఉదయం, సాయంత్రం పరీక్షించాల్సి ఉంది. కాగా, ఇక్కడ పనిచేసే ఇద్దరు వైద్యుల్లో ఒకరిని సోమ, మంగళవారాల్లో, మరొకరిని శుక్ర, శనివారాల్లో వింజమూరు పీహెచ్సీల్లో విధులు నిర్వహించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కీలకమైన చిన్నపిల్లల విభాగంలో వారంలో నాలుగు రోజులు ఒక్కరే అందుబాటులో ఉంటున్నారు. రక్త నిల్వ కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులోనూ ఎవరూ లేరు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్ కూడా లేరు. ప్రసూతీ విభాగంలో గతంలో నలుగురు వైద్యులు ఉండగా.. ఒకరిని బదిలీ చేశారు. మరొకరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో ఇద్దరు మాత్రమే ప్రస్తుతం సేవలందిస్తున్నారు. ఈ మొత్తం పరిస్థితుల కారణంగా ఇంత పెద్ద ఆసుపత్రి కేవలం ప్రథమ చికిత్సలకే పరిమితమవుతోంది. అధికశాతం ఒంగోలు రిమ్స్కు సిఫార్సు చేస్తుండగా.. రోగులను అక్కడికి తీసుకువెళ్లేలోపే ప్రాణాలు పోతున్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు.
కొరత నిజమే.. నివేదించాం
- డాక్టర్ శకుంతల, ఆసుపత్రి సూపరింటెండెంట్
ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉంది. జనరల్ మెడిసిన్, సివిల్ సర్జన్ స్పెషలిస్టులు, ఎలక్ట్రీషియన్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నాం. నర్సులు, సిబ్బంది సరిపడా ఉన్నారు. మందుల కొరత లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం