నిమ్మ రైతుకు జగన్ దగా
అయిదేళ్ల వైకాపా పాలనలో హామీలే తప్ప వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెట్టప్రాం తం కావడంతో ఎక్కువ మంది వర్షాధారిత పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు..
వైకాపా పాలనలో కానరాని అనుబంధ పరిశ్రమలు
అయిదేళ్లలో నెరవేరని హామీలు
పొదలకూరు: మార్కెట్లో నిమ్మకాయలు గ్రేడింగ్ చేస్తున్న రైతులు
అయిదేళ్ల వైకాపా పాలనలో హామీలే తప్ప వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెట్టప్రాం తం కావడంతో ఎక్కువ మంది వర్షాధారిత పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు..
హామీ.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు జలకళ పథకం ద్వారా బోరు, మోటారు, విద్యుత్తు, ఇతర సామగ్రి ఉచితంగా అందిస్తామని పాదయాత్రలో భాగంగా ఇనుకుర్తిలో నిమ్మ రైతులకు అప్పటి ప్రతిపక్షనేత సీఎం జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన హామీ.
వాస్తవం.. అయిదేళ్లలో కొన్ని చోట్ల బోర్లు మాత్రమే వేశారు. కొన్నిచోట్ల చుక్కనీరు పడక నిరుపయోగంగా మారాయి. వేసిన చోట మోటారు, విద్యుత్తు ఇతర సామగ్రి సమకూర్చలేదు. మంత్రి కాకాణి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నిమ్మమార్కెట్ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం నిమ్మ ఆధారిత పరిశ్రమ ఒక్కటి కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.
న్యూస్టుడే, పొదలకూరు
వేల ఎకరాల్లో నిమ్మసాగు చేసి మార్కెట్లో విక్రయించి పలు రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు.. సాగుదారులకు అవసరమైన వసతులు పూర్తిస్థాయిలో కల్పించి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పిన తరువాత పట్టించుకున్న దాఖలాలు లేవు. తరచూ సమావేశాల్లో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి రైతులకెంతో చేశామని తరచూ సమావేశాల్లో ప్రగల్భాలు పలకడమే తప్ప నిమ్మ ఆధారిత పరిశ్రమల ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించడంతో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది
55 వేల ఎకరాల్లో సాగు..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొదలకూరు, రాపూరు, కలువాయి, చేజర్ల, ఆత్మకూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాలతోపాటు గూడూరు డివిజన్లో అన్ని మండలాల్లో నిమ్మ సాగు ఎక్కువగా సాగు చేస్తారు. దిగుబడులకు ధరలున్నా లేకున్నా మార్కెట్కు తీసుకొచ్చి విక్రయించాలి. దళారులు, కమీషన్ వ్యాపారుల చేతిలో నిత్యం సాగుదారులు మోసపోతున్నారు. ప్రతి ఏటా వేసవిలో మార్చి నుంచి ఆగస్టు వరకు ఆరు నెలల వరకు ధరలు బాగుంటాయి. మిగతా ఆరు నెలలు డిమాండ్ లేక తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.
తెదేపా పాలనలో వసతుల ఏర్పాటు..
నిమ్మ మార్కెట్ పరిధిలో 2006లో 20 దుకాణాలు నిర్మించి అర్హులైన రైతులకు అద్దె ప్రాతిపదికన ఇచ్చారు. 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత యార్డు రూపురేఖలు మారిపోయాయి. భారీ వాహనాలు తిరిగినా కుంగిపోకుండా సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు నిర్మించారు. 24 కొత్త దుకాణాలు నిర్మించారు. మౌలిక వసతులు కల్పించారు.
అర్హులకు దుకాణాలు కేటాయించాలి.. నిమ్మ యార్డు ఏర్పడిన కొత్తలో కాంగ్రెస్ ప్రభుత్వం, 13 ఎకరాల్లో ప్రహరీ నిర్మిస్తే తెలుగుదేశం హయాంలో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి 24 కొత్త దుకాణాలు, రహదారులు, సైడు కాలువలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. కొత్తగా నిర్మించిన దుకాణాలు వేలం ద్వారా యార్డులో వ్యాపారం చేసుకోనేవారికి కేటాయించాలని నిర్ణయించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేయని వైకాపా శ్రేణులకు కట్టబెట్టడంతో పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సాగుదారులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. నిమ్మయార్డులో రోజుకు సుమారు 300 మందికి పైగా పనులు చేస్తున్నారు. రైతుల విశ్రాంతి గదిలో ప్రస్తుతం కార్యాలయం నిర్వహిస్తున్నారు. చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని నిమ్మ మార్కెట్ కమిటీ కార్యదర్శి డి.నవీన్కుమార్ తెలిపారు.
వ్యాపారం చేసేవారికే దుకాణాలు కేటాయించాలి : రామలింగయ్య, రైతు
యార్డులో వ్యాపారం చేసుకునే వారికి దుకాణాలు కేటాయించాలి. బయట వారికి ఎక్కువ ఇచ్చారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అద్దె కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. అర్హులంతా చెట్ల కింద ఉంటున్నారు. వర్షమొస్తే వీరి పరిస్థితి ఇబ్బందికరôగా మారింది. అందుకే హై కోర్టును ఆశ్రయించాం. తీర్పు అనుకూలంగా వచ్చింది.
భారీగా నష్టపోయాం: దొరబాబు, రైతు
నిమ్మయార్డులో తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు మెరుగుపరచాలని ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదు. గతేడాది తుపాను ప్రభావంతో సాగుదారులు భారీగా నష్టపోయారు. వారికి పరిహారం అందక అప్పులపాలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
200 మంది పేదలకు అన్నదానం
[ 02-05-2024]
కావలి పట్టణం కచ్చేరి మిట్ట నివాసులు కీర్తిశేషులు శ్రీనివాస వరప్రసాద రావు మూడవ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి సుజాత అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. -
బోగోలు మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
బోగోలు మండలంలో కావలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొదలకూరు కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేశారు. -
తెదేపాలో చేరిన రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెదేపాలో చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. -
తెదేపాలో చేరిన పలువురు వైకాపా నేతలు
[ 02-05-2024]
దగదర్తి మండలం కౌరుగుంట పంచాయతీ సున్నపుబట్టీ గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన పలువురు వైకాపా నాయకులు మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. -
తెదేపా ప్రభంజనం ఖాయం
[ 02-05-2024]
‘నెల్లూరు జిల్లాలో తెదేపా ప్రభంజనం ఖాయం. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డితో పాటు.. నెల్లూరు నగర, గ్రామీణ ఎమ్మెల్యేలుగా నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలను గెలిపించండి. -
జగనన్న ఇళ్లు.. అక్రమాల వాకిళ్లు!
[ 02-05-2024]
ఒక్క అవకాశమివ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తాం.. అని ఎన్నికల ముందు హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. -
బ్యాంకు ఖాతాలకు జమకాని నగదు
[ 02-05-2024]
పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం పండుటాకులతో రాజకీయ ఆట ఆడుకుంటూ వృద్ధులు, దివ్యాంగులను అష్టకష్టాలు పెడుతోంది. -
రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్
[ 02-05-2024]
సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ను కేంద్ర ఎన్నికల పరిశీలకులు నితిన్ సింగ్ బదారియా పర్యవేక్షణలో కలెక్టర్ ఎం.హరినారాయణన్ నిర్వహించారు. -
ఇవేనా ఊళ్లు.. లబ్ధిదారులకు కన్నీళ్లు
[ 02-05-2024]
నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని వైకాపా గత ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసింది. -
వారాంతపు సెలవులకు జగన్ టోపి
[ 02-05-2024]
శాంతి భద్రతలు బాగుండాలన్నా.. వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నా.. సమాజం సుఖసంతోషాలతో ఉండాలన్నా పోలీసులతోనే సాధ్యం. -
అధికార పార్టీ.. ప్రలోభాల ఎర!
[ 02-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గరపడేకొద్దీ అధికార పార్టీ.. ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేసింది. ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలనే లక్ష్యంతో అడ్డదారులు తొక్కేందుకు సిద్ధమవుతోంది. -
తాగునీటికి కటకట
[ 02-05-2024]
సిద్ధార్థనగర్ ఆనుకుని పట్టణం నుంచి మురుగు ప్రవహిస్తోంది. అక్కడి బోరు నీరు రంగు మారి వినియోగానికి పనికి రావటంలేదు. -
స్వచ్ఛత మాయం.. రోగాలు ఖాయం
[ 02-05-2024]
ఇంటింటికీ చెత్త సేకరిస్తాం.. పట్టణాన్ని చెత్త రహితంగా చేస్తాం.. ఇదీ పురపాలకు నినాదం.. కానీ ఆచరణలో పాటించడం లేదు.వీధుల్లో చెత్త శుభ్రం చేయడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్