తాడ్వాయి కో-ఆప్షన్సభ్యుడి ఎన్నికకు నోటిఫికేషన్
జిల్లాలోని తాడ్వాయి మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నికను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 27వ తేదీన సభ్యుడి ఎన్నికకు సంబంధించి మండలంలోని ఎంపీటీసీ సభ్యులకు నోటీసు ద్వారా సమాచారం అందించనున్నారు.
ఈనాడు, కామారెడ్డి: జిల్లాలోని తాడ్వాయి మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నికను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 27వ తేదీన సభ్యుడి ఎన్నికకు సంబంధించి మండలంలోని ఎంపీటీసీ సభ్యులకు నోటీసు ద్వారా సమాచారం అందించనున్నారు. 29వ తేదీన ఉదయం 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 వరకు నామపత్రాల స్క్రూటినీ చేస్తారు. 1 గంట వరకు నామపత్రాల ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. ఆ తర్వాత మండల పరిషత్ ప్రత్యేక సమావేశం నిర్వహించి కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నికను నిర్వహించేందుకు జిల్లా రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖాళీగా నాగిరెడ్డిపేట ఎంపీపీ, వైస్ఎంపీపీ పదవులు
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట ఎంపీపీ పదవి నాలుగున్నర ఏళ్లుగా ఖాళీగా ఉంటోంది. కొద్దిరోజుల వరకు వైస్ ఎంపీపీ రాజ్దాస్ ఇన్ఛార్జి ఎంపీపీగా కొనసాగారు. ఇటీవలే మండలంలోని మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు ప్రకటించిన అవిశ్వాసం నెగ్గడంతో ఆయన పదవీ కోల్పోయారు. ప్రస్తుతం మండల పరిషత్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎంపీటీసీల పదవీకాలం గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తారో లేదో అనే చర్చ ఇప్పటి వరకు ఉండేది. ప్రస్తుతం తాడ్వాయి కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో.. జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు లోక్సభ ఎన్నికల కోడ్ అనంతరం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్నకు వందనం
[ 16-06-2024]
: నాన్న.. త్యాగాలకు నిలువెత్తు రూపం. కష్టాల కడలిలో ఒడ్డుకు చేర్చే నావికుడు. భవితకు మార్గం చూపే మార్గదర్శకుడు. -
గిరిజన జీవితాలే.. నా పుస్తకాలు
[ 16-06-2024]
గిరిజన జీవితాలను, విభిన్న మనస్తత్వాలను సుఖదుఃఖాలను లోతుగా పరిశీలించారు. తను చూసిన బతుకునీ, తన వాళ్ల వెతల్నీ, కథల్నీ కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. -
అటవీ అధికారులకు రక్షణ కల్పించాలి
[ 16-06-2024]
అడవుల సంరక్షణ, భూములు అన్యాక్రాంతం కాకుండా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఫారెస్టు రేంజ్ అధికారుల సంఘం(బాసర సర్కిల్) ఉపాధ్యక్షుడు రవిమోహన్ భట్, జూనియర్ అటవీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు. -
విక్రయించిన ప్రతి బస్తాకూ లెక్క
[ 16-06-2024]
విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని, విక్రయించిన ప్రతి బస్తాకు లెక్కలుండాలని అదనపు కలెక్టర్ కిరణ్ ఆదేశించారు. -
ఎమ్మెల్యే సార్లూ.. మీరంతా కదలండీ
[ 16-06-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఎన్నికల సందర్భాల్లో అన్ని పార్టీలు హామీలిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని బేగంపూర్ చౌరస్తా వద్ద 161వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. -
ఇస్కాన్ కేంద్రానికి ప్రచార వాహనం అందజేత
[ 16-06-2024]
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రానికి మహేశ్వరి సేవా సమాజ్ సభ్యులు శనివారం ఉచితంగా ధర్మ ప్రచార వాహనం అందించారు. -
రైతులు ఓటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
[ 16-06-2024]
సహకార బ్యాంకులో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంట్)ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంకు మేనేజర్ సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
[ 16-06-2024]
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం: మంత్రి నారాయణ
-
సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
-
విచారణ పూర్తికాకముందే తీర్పు ఎలా ఇస్తారు?: జగదీశ్ రెడ్డి
-
‘నీట్’ వివాదం.. సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి: సిబల్
-
రుషికొండపై రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా
-
జూన్ 30లోగా గనులను వేలం వేయాలి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచన