ఇరవై ఏళ్లుగా అన్నదానం
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ప్రాంగణం.. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు అభివృద్ధి చేసిన ఖిల్లా రఘునాథాలయం ఇందూరుకే తలమానికంగా నిలుస్తోంది.
ఖిల్లా రఘునాథాలయంలో భక్తులకు భోజనాలు వడ్డిస్తున్న ప్రతినిధులు
న్యూస్టుడే, నిజామాబాద్ సాంస్కృతికం: తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ప్రాంగణం.. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు అభివృద్ధి చేసిన ఖిల్లా రఘునాథాలయం ఇందూరుకే తలమానికంగా నిలుస్తోంది. నిత్యపూజలతో పాటు ప్రతి శనివారం విశేష అర్చనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చే భక్తుల కోసం అన్నదానం అందిస్తున్నారు. ఇందుకోసం ఇరవై ఏళ్ల క్రితమే కొందరు భక్తులు శ్రీరామ అన్నప్రసాద కమిటీ నెలకొల్పి ప్రతివారం అన్నదానం చేస్తున్నారు.
సభ్యులే ముందుగా..
ఆలయంలో శనివారం అర్చనలు, మంగళహారతులు సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది భక్తులు తరలివస్తారు. ఎత్తయిన కొండ ఉండటం, పూజలు పూర్తయ్యే వరకు మధ్యాహ్నం అవుతుండటంతో అన్నదానం ఏర్పాటు చేయాలని కొందరు భక్తులు భావించారు. 2003లో విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు కలిసి ప్రత్యేకంగా శ్రీరామ అన్నప్రసాద కమిటీ ఏర్పాటు చేశారు. అశోక్కుమార్ కన్వీనర్గా, సుభాష్, రాజేంద్రప్రసాద్, బంటు రాము, శివ తదితరులు దీనిని ప్రారంభించారు. అన్నదానం కోసం రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇందు కోసం సొంతంగా నిధులు జమ చేసుకునే వారు. తర్వాత కాలంలో మరికొందరు వారిని ప్రోత్సహించారు. పుట్టిన రోజు, పెళ్లిరోజు, బారసాల, శుభకార్యాలు, సత్యనారాయణ వ్రతం చేసుకునేవారు అన్నదానానికి సహకరిస్తున్నారు.
రాములోరి సేవలో తరించాలని..
- అశోక్కుమార్, కమిటీ కన్వీనర్
ఇది జిల్లాలోనే గొప్ప మందిరం. రాములోరి సేవలో తరలించాలని అన్నదానం కోసం మిత్రులందరం కలిసి 20 ఏళ్ల క్రితం కమిటీ ఏర్పాటు చేశాం. చాలా ఏళ్లుగా మేమే సొంతంగా నిధులు సమకూర్చుకొని కొనసాగిస్తున్నాం. దాతలు ఎవరూ ముందుకు రాని సందర్భంలో మా కమిటీ ప్రతినిధులు లింగం, దిలీప్, నర్సయ్య, రాకేశ్ పటేల్, దేవేందర్, రాజు, ఆనంద్, మాధవరావు, శంకర్, బాలరాజు, పోశెట్టి, వీరేశం డబ్బులు వెచ్చిస్తారు. మా పిల్లల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్నకు వందనం
[ 16-06-2024]
: నాన్న.. త్యాగాలకు నిలువెత్తు రూపం. కష్టాల కడలిలో ఒడ్డుకు చేర్చే నావికుడు. భవితకు మార్గం చూపే మార్గదర్శకుడు. -
గిరిజన జీవితాలే.. నా పుస్తకాలు
[ 16-06-2024]
గిరిజన జీవితాలను, విభిన్న మనస్తత్వాలను సుఖదుఃఖాలను లోతుగా పరిశీలించారు. తను చూసిన బతుకునీ, తన వాళ్ల వెతల్నీ, కథల్నీ కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. -
అటవీ అధికారులకు రక్షణ కల్పించాలి
[ 16-06-2024]
అడవుల సంరక్షణ, భూములు అన్యాక్రాంతం కాకుండా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఫారెస్టు రేంజ్ అధికారుల సంఘం(బాసర సర్కిల్) ఉపాధ్యక్షుడు రవిమోహన్ భట్, జూనియర్ అటవీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు. -
విక్రయించిన ప్రతి బస్తాకూ లెక్క
[ 16-06-2024]
విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని, విక్రయించిన ప్రతి బస్తాకు లెక్కలుండాలని అదనపు కలెక్టర్ కిరణ్ ఆదేశించారు. -
ఎమ్మెల్యే సార్లూ.. మీరంతా కదలండీ
[ 16-06-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఎన్నికల సందర్భాల్లో అన్ని పార్టీలు హామీలిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని బేగంపూర్ చౌరస్తా వద్ద 161వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. -
ఇస్కాన్ కేంద్రానికి ప్రచార వాహనం అందజేత
[ 16-06-2024]
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రానికి మహేశ్వరి సేవా సమాజ్ సభ్యులు శనివారం ఉచితంగా ధర్మ ప్రచార వాహనం అందించారు. -
రైతులు ఓటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
[ 16-06-2024]
సహకార బ్యాంకులో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంట్)ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంకు మేనేజర్ సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
[ 16-06-2024]
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు.. అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం
-
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
-
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?
-
రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి..ఫొటోలు వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పవన్ కల్యాణ్కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్.. అదేంటంటే?