అయినవారే అంతమొందిస్తున్నారు
నిజామాబాద్ జిల్లా మోపాల్లో భూతగాదా విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకొని శుక్రవారం సతీష్ అనే యువకుడు తన తండ్రి అబ్బయ్యతో పాటు చిన్నాన్న నడిపి సాయిలును పారతో కొట్టి ప్రాణాలు తీయడం కలకలం రేపింది. రక్షణగా ఉండాల్సిన రక్త సంబంధీకులే కాలయములుగా
మంటగలుస్తున్న మానవ విలువలు
పెరుగుతున్న కుటుంబ నేరాలు
నిజామాబాద్ జిల్లా మోపాల్లో భూతగాదా విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకొని శుక్రవారం సతీష్ అనే యువకుడు తన తండ్రి అబ్బయ్యతో పాటు చిన్నాన్న నడిపి సాయిలును పారతో కొట్టి ప్రాణాలు తీయడం కలకలం రేపింది.
రక్షణగా ఉండాల్సిన రక్త సంబంధీకులే కాలయములుగా మారి కాటికి పంపుతున్నారు. కంటికి రెప్పలా కాపాడిన తండ్రినే నరికి చంపుతున్నారు. పురిటి నొప్పులకోర్చి జన్మనిచ్చిన తల్లినే కడతేరుస్తున్నారు. ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ములు గుంట భూమికోసం ప్రాణాలు బలితీసుకుంటున్నారు. వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తని ప్రియుడితో కలిసి అంతమొందించిన భార్య.. తన బంధానికి అడ్డొస్తుందని కన్న కూతురినే నలిపేసిన తల్లి.. అనుమానంతో కడుపున పుట్టిన బిడ్డను చిదిమేసిన తండ్రి.. ఇలా రక్త సంబంధాలకు మచ్చ తెచ్చే ఉదంతాలతో మానవ విలువలు మంట గలుస్తున్నాయి. తల్లీ-బిడ్డ, తండ్రీ-కొడుకు, భార్యా-భర్త, మామా-అల్లుడు, అన్నా-తమ్ముడు.. బంధమేదైనా రక్త చరిత్ర రాస్తున్న సందర్భాలు పెరిగిపోతున్నాయి. చిన్న తగాదాలకే తలలు పగలగొట్టి చంపుకొనే విష సంస్కృతికి బీజం వేయడంపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. బాంధవ్యాలకు విలువనిచ్చే ఆరోగ్యకరమైన సమాజం వైపు అడుగులు పడాల్సిన అవసరం ఉంది.
బంధాలకు విలువ పెంచితేనే..
బాంధవ్యాల విలువలు నేర్పేవారు లేకపోవడంతో ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇంట్లోని వృద్ధులు.. చుట్టరికాల ప్రాధాన్యం తెలుపుతూ విలువలు నేర్పిస్తుంటారు. ఈ వ్యవస్థ ఛిన్నాభిన్నమవడంతో భావితరాలకు బంధాల విలువలు చెప్పేవారే లేకుండా పోయారు. ప్రస్తుతం బంధుత్వాలు కృత్రిమంగా మారిపోవడంతో మారణహోమం చెలరేగుతోంది. అయినవారిపై అఘాయిత్యాలను నియంత్రించేలా స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు అవగాహన సదస్సులు, కళాజాత ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
చైతన్యం తెస్తాం
- శ్రీనివాస్రెడ్డి, ఎస్పీ, కామారెడ్డి జిల్లా
రక్త సంబంధాలపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడతాం. జీవితం విలువలు తెలిపే విధంగా ప్రజాసంబంధాలపై గ్రామాల్లో చైతన్యం తెస్తాం. అవకాశం దొరికినప్పుడల్లా చుట్టరికాలు, మానవ సంబంధాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రయోజనాలపై కళాజాతల ద్వారా తెలియజేస్తున్నాం.
మచ్చుకు కొన్ని ఘటనలు
ఠాణా పరిధి ఎవరు ఎవరినంటే..
* మద్నూర్ పతిని హతమార్చిన పత్ని
* బిచ్కుంద కొడుకు చేతిలో తండ్రి హతం
* రామారెడ్డి కొడుకే తండ్రి ఊపిరి తీశాడు
* బీర్కూర్ భార్యను భర్తే హతమార్చాడు
* కామారెడ్డి పాత కక్షలతో స్నేహితుడి ప్రాణం తీశారు
* మాచారెడ్డి పైసల కోసం బావను కడతేర్చాడు
* కామారెడ్డి తాగుడుకు బానిసైన భర్తను భార్యే హత్య చేసింది
* మాక్లూర్ ప్రియుడితో కలిసి భర్తను బలితీసుకుంది
* నాగిరెడ్డిపేట అక్రమ సంబంధం బయట పడుతుందని బాలుడి హత్య
* నస్రుల్లాబాద్ డబ్బుల విషయంలో సొంత తమ్ముడిని హత్య చేశాడు
* నాగిరెడ్డిపేట పింఛను డబ్బులు ఇవ్వలేదని కన్నకొడుకే తండ్రిని కాటికి పంపాడు
* నవీపేట భార్యాభర్తల తగాదాల్లో.. మామను కోడలు పుట్టింటివారు కొట్టి చంపారు
* దోమకొండ ఆస్తి విషయంలో తోడబుట్టిన అన్నను తన భార్యతో కలిసి తమ్ముడే కడతేర్చారు
* దేవునిపల్లి భర్త తాగుడుకు బానిసయ్యాడని భార్యే తన తల్లిదండ్రులతో కలిసి అతని ప్రాణాలు తీసింది
* గాంధారి అక్రమ సంబంధం బయట పడుతుందని పెంచుకుంటున్న కొడుకును స్వయాన పెద్దమ్మే చిదిమేసింది
* నిజామాబాద్ వరుసకు సోదరుడైన వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని అతణ్ని భర్తే అంతమొందించాడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్