logo

ఉత్తమ గ్రామ పంచాయతీగా కుకునూరుకు అవార్డు

రాష్ట్ర ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా హైదరాబాద్‌లో వేల్పూర్‌ మండలం కుకునూర్‌ సర్పంచి విజయ శుక్రవారం అందుకున్నారు.

Published : 01 Apr 2023 05:12 IST

మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సర్పంచి విజయ

కుకునూర్‌(వేల్పూర్‌), న్యూస్‌టుడే: రాష్ట్ర ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా హైదరాబాద్‌లో వేల్పూర్‌ మండలం కుకునూర్‌ సర్పంచి విజయ శుక్రవారం అందుకున్నారు. 2021- 22 ఏడాదికి గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలను 9 అంశాల ప్రాతిపదికన పురస్కారాలివ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లా నుంచి కుకునూర్‌ పంచాయతీ నీటి సమృద్ధిలో ఈ అవార్డును సాధించింది. రాష్ట్ర ఉత్తమ పంచాయతీగా కుకునూర్‌ ఎంపికవడం సంతోషంగా ఉందని సర్పంచి పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి జయసుధ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని