సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
నిజాంసాగర్ ద్వారా 1.15 లక్షల ఎకరాలకు సరఫరా
ఈనాడు, కామారెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వారబందీ పద్ధతి అమలుతో పాటు పొదుపుగా నీటి వినియోగం కారణంగా ఉమ్మడి జిల్లా వరదాయినిగా పేరుగాంచిన నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 5.97 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్లో 1.15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిపారుదల శాఖ అధికారులు సాగునీటిని సరఫరా చేశారు. చివరి విడతగా ఈ నెలాఖరు వరకు విడుదల చేయనున్నారు. తుదకు ప్రాజెక్టులో మరో నాలుగు టీఎంసీల మేర నీటి నిల్వలు ఉండనున్నాయి.
ఆరువిడతల్లో 9.36 టీఎంసీలు
ప్రస్తుత యాసంగి సీజన్లో ఆయకట్టుకు ఆరువిడతల్లో 9.36 టీఎంసీల నీటిని సరఫరా చేశారు. చివరి విడతలో మరో 1.4 టీఎంసీ విడుదల చేయనున్నారు. వానాకాలం చివర్లో కురిసిన భారీవర్షాలతో ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి పూర్తిస్తాయి నీటిమట్టానికి నీటి నిల్వలు చేరుకున్నాయి. అలీసాగర్ వరకు 49వ డిస్ట్రిబ్యూటరీ వరకు ప్రారంభంలో సాగునీటిని సరఫరా చేశారు. బోధన్ డివిజన్ పరిధిలో వరికోతలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం 38వ డిస్ట్రిబ్యూటరీ వరకు సాగునీటిని అందిస్తున్నారు. ఇదే విధంగా బోధన్ పట్టణ అవసరాల కోసం బెల్లాల్ చెరువుకు సైతం నీటిని అందించారు.
వారబందీ పద్ధతిలో..
యాసంగి సీజన్ ప్రారంభంలో ప్రాజెక్టులో 12 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. వారబందీ పద్ధతిని అమలు చేసి పదిహేను రోజులకోసారి నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు కింద పంటలకు ఇబ్బందులు లేకుండా పోయాయి. ఆయకట్టు పరిధిలో మెజారిటీ రైతులు బోరుబావులు తవ్వుకుని పంటలు పండించుకుంటున్నారు. కేవలం మొదటి ఆయకట్టు రైతులు మాత్రమే పూర్తిగా ప్రాజెక్టు నీటి మీదనే ఆధారపడుతున్నారు. వీరికి మాత్రమే విడతల వారి సాగునీటి సరఫరాతో కొంత మేర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
పూడిక తొలగిస్తే పెరగనున్న నిల్వలు
రెండేళ్ల కిందట ప్రయోగాత్మకంగా గోదావరి జలాలను హల్దీవాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు తరలించారు. ఆశించిన స్థాయిలో సాగునీరు చేరకపోవడంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి హల్దీవాగు ద్వారా కాళేశ్వరం జలాలను తరలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో నిజాంసాగర్కు గోదావరి జలాల తరలింపు సాధ్యమయ్యేలా కనపడడం లేదు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో వచ్చిన వరద నీటిని నిల్వ చేసుకుంటేనే ఆయకట్టు కింద రెండు పంటలు పండనున్నాయి. ఏటా ప్రాజెక్టులో పూడిక పేరుకుపోతున్న నేపథ్యంలో.. ఒకసారి ప్రాజెక్టు నిండితే రెండు పంటలు పండేలా లేవు. దీంతో ప్రాజెక్టులో పూడిక తొలగింపునకు ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవసరం ఉంది. ఈ దిశగా ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తేనే నిధులు మంజూరై పూడిక తొలగింపు పనులు ప్రారంభించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడప గడపకు కాంగ్రెస్
[ 27-04-2024]
మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెత్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు శనివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం