logo

గడప గడపకు కాంగ్రెస్

మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెత్కర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్‌ నాయకులు శనివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు.

Published : 27 Apr 2024 12:48 IST

నాగిరెడ్డిపేట: మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెత్కర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్‌ నాయకులు శనివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీలు ప్రజలకు లబ్ధి చేకూర్చాయని, కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ ఠాగూర్, నాగిరెడ్డిపేట్ విలేజ్ ప్రెసిడెంట్ మన్నె వెంకట్, వైస్ ప్రెసిడెంట్ సాయి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని