logo

పార్టీ నిర్ణయాలకు కార్యకర్తలు కట్టుబడి ఉండాలి

పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు శ్రీధర్‌ గౌడ్‌ అన్నారు.

Published : 05 May 2024 13:33 IST

నాగిరెడ్డిపేట: పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు శ్రీధర్‌ గౌడ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌గౌడ్‌ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. వివిధ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసే ప్రచారం ఇంకా ఉధృతం చేయాలన్నారు.  ఎవరైనా సరే పార్టీని కాదని వేరే పార్టీకి మద్దతిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని