logo

కాంగ్రెస్‌ చిత్తశుద్ధితో ఉంది: ఇందుప్రియ

ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ చిత్తశుద్ధితో ఉందని బల్దియా ఛైర్‌పర్సన్‌ ఇందు ప్రియ అన్నారు.

Updated : 07 May 2024 15:38 IST

కామారెడ్డి పట్టణం: ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ చిత్తశుద్ధితో ఉందని బల్దియా ఛైర్‌పర్సన్‌ ఇందు ప్రియ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశం మరింత ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్, పాత శివ కృష్ణమూర్తి, బండారి శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని