logo

దళిత వికాస ఇన్‌ఛార్జిలకు సన్మానం

తాండూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులను జహీరాబాద్ పార్లమెంట్ దళిత వికాస ఇన్‌ఛార్జిగా  నియమితులైన ప్రభాకర్‌ను, ఎల్లారెడ్డి నియోజకవర్గ దళిత వికాస ఇన్‌ఛార్జిగా ఎన్నికైన బోరంచ సాయిలను కాంగ్రెస్ కార్యకర్తలు శాలువాతో ఘనంగా సన్మానించారు.

Published : 07 May 2024 14:18 IST

నాగిరెడ్డిపేట: తాండూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులను జహీరాబాద్ పార్లమెంట్ దళిత వికాస ఇన్‌ఛార్జిగా  నియమితులైన ప్రభాకర్‌ను, ఎల్లారెడ్డి నియోజకవర్గ దళిత వికాస ఇన్‌ఛార్జిగా ఎన్నికైన బోరంచ సాయిలను కాంగ్రెస్ కార్యకర్తలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శేత్కర్ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజాధరణ పొందాయని ,ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దివిటి కిష్టయ్య, దేవకుమార్, వేముల సంగయ్య, సంగయ్య, మసూద్, సిద్ధిరాములు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని