logo

పదిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి అభినందనలు

పదో తరగతి ఫలితాల్లో  ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని గోపాల్‌పేట్‌ గ్రామ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు.

Published : 08 May 2024 10:51 IST

నాగిరెడ్డిపేట: పదో తరగతి ఫలితాల్లో  ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని గోపాల్‌పేట్‌ గ్రామ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. గ్రామానికి చెందిన నబిల్ అహ్మద్‌ ఇటీవల వెలువడి పదో తరగతి ఫలితాల్లో 9.7 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. రానున్న రోజుల్లో  ఎలాంటి  పరీక్షల్లోనైనా  ఉత్తమ ప్రతిభ కనబరిచి గోపాల్‌పేట్‌ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి పేట మండలం మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఇమామ్, గోపాల్‌పేట్ టౌన్ ప్రెసిడెంట్ శేఖర్,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ గులాం హుస్సేన్ విక్రమ్ ఫారూఖ్,  రాజు,  అలీమ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని