logo

భాజపా మాయమాటలు నమ్మి మోసపోకండి

దేవుడు పేరిట ఓట్లు అడిగేందుకు వస్తున్న భాజపా నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దంటూ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు.

Published : 08 May 2024 11:56 IST

బీర్కూర్‌: దేవుడు పేరిట ఓట్లు అడిగేందుకు వస్తున్న భాజపా నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దంటూ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం బీర్కూర్‌ మండలంలోని భైరాపూర్, మల్లాపూర్‌, బీర్కూర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనం రూ.400 చెల్లిస్తామని చెప్పారు. ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామన్నారు. జహీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌షెట్కార్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం రెండు పడకగదుల ఇళ్ల బిల్లును  అడ్డుకున్నారంటూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు.  ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు గంగారం, బాస్వరాజు, చందు, ఓంకార్‌, కృష్ణారెడ్డి, రాములు, కిరణ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని