logo

కొనసాగుతున్న భాజపా ఎన్నికల ప్రచారం

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భాజపా అభ్యర్థి  బీబీ పాటిల్‌కు మద్దతుగా  మండల పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 08 May 2024 14:23 IST

నాగిరెడ్డిపేట: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భాజపా అభ్యర్థి  బీబీ పాటిల్‌కు మద్దతుగా  మండల పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా  బొల్లారం, చిన్న ఆత్మకూరులో ప్రచారాన్ని కొనసాగించారు.  పదేళ్లుగా  ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. పేదలు, మహిళల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రారంభించారని తెలిపారు.  రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కమలం పువ్వుకు ఓటు వేసి భారీ మెజార్టీతో బీబీపాటిల్‌ను గెలిపించి మోదీకి బహుమతిగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రాజామోహన్ రెడ్డి, నాయకులు , కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని