ఎన్నికల ప్రచారం చివరి దశకు
లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది.
పర్యటించని ప్రాంతాలపై పార్టీల దృష్టి
ఈనాడు, కామారెడ్డి: లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. మిగిలిన తక్కువ సమయంలో ముఖ్యనేతలను రప్పించి పట్టణాలు, మండల కేంద్రాల్లో రోడ్షోలు, సమావేశాలు నిర్వహించేలా మూడు ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటివరకు పర్యటించని ప్రాంతాల్లో నియోజకవర్గ, జిల్లా నేతలతో ప్రచారం చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.
అగ్రనేతల సభలు
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిల బహిరంగసభను ఈ నెల 11న కామారెడ్డి జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేశారు. తుది రోజుల్లో ప్రచారాన్ని చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించారు.
పోల్మేనేజ్మెంటుకు రంగం సిద్ధం
పోల్మేనేజ్మెంట్ను పక్కాగా చేపట్టేందుకు అభ్యర్థులు, నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి పోలైన ఓట్లు ఎన్ని, ఏ ప్రాంతంలో తగ్గాయో బేరీజు వేసుకుంటూ ఆయా చోట్ల ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. పార్టీలు, కులాల వారీగా ప్రతీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో లెక్కలు తీశారు. వీటి ఆధారంగా పోల్ మేనేజ్మెంట్ ఎక్కడ ఎలా చేస్తే గెలుస్తామనే అంశంపై కసరత్తు చేపట్టి చివరి అంకం విజయవంతంగా పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నారు. మహిళా సంఘాల నాయకురాళ్లతో సైతం చర్చలు జరుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
-
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
-
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
-
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే