Anaconda: తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చిన అనకొండ
భువనేశ్వర్లోని నందన్కానన్ జంతు ప్రదర్శనశాలలో ఉన్న అనకొండ 9 పిల్లలకు జన్మనిచ్చింది. రాష్ట్రంలో అనకొండకు పిల్లలు జన్మించడం ఇదే తొలిసారి. నందన్కానన్ అధికారులు తెలిపిన ప్రకారం.. 2019లో చెన్నైలోని మొసళ్ల పార్కు
భువనేశ్వర్ అర్బన్, న్యూస్టుడే: భువనేశ్వర్లోని నందన్కానన్ జంతు ప్రదర్శనశాలలో ఉన్న అనకొండ 9 పిల్లలకు జన్మనిచ్చింది. రాష్ట్రంలో అనకొండకు పిల్లలు జన్మించడం ఇదే తొలిసారి. నందన్కానన్ అధికారులు తెలిపిన ప్రకారం.. 2019లో చెన్నైలోని మొసళ్ల పార్కు నుంచి 8 పసుపు రంగు అనకొండలను నందన్కానన్ జూకు తీసుకొచ్చారు. అనంతరం ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ సంస్థ (ఓయూఏటీ), జూ అధికారులు కలిసి అనకొండల సంతతి పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా ఆ ప్రయత్నం ఫలించిందని తెలిపారు. గురువారం అనకొండ ఓ పిల్లకు జన్మనిచ్చింది. అనంతరం అనారోగ్యానికి గురైంది. కడుపు పొంగిపోవడంతో వైద్యులు, ఓయూఏటీ నిపుణులు చికిత్స ప్రారంభించారు. పాము పొట్టలో పిల్లలు ఉన్నట్లు గుర్తించి అవి సురక్షితంగా బయటకు వచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. శుక్రవారం 9 పిల్లలు జన్మించగా వాటిలో ఒకటి మృతి చెందిందని అధికారులు తెలిపారు. చెన్నై నుంచి తీసుకొచ్చిన వాటిలో మూడు మృతి చెందాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం