ఉత్తర బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం
ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది శని, ఆదివారాల్లో రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపుతుందని గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం ఐఎండీ అధికారి ఉమాశంకర్ దాస్ శుక్రవారం ‘న్యూస్టుడే’కు చెప్పారు
రెండు రోజులు భారీ వర్షాలకు అవకాశం
అఖువాపద వద్ద వైతరణి ప్రమాద స్థాయికి
గోపాలపూర్, న్యూస్టుడే: ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది శని, ఆదివారాల్లో రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపుతుందని గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం ఐఎండీ అధికారి ఉమాశంకర్ దాస్ శుక్రవారం ‘న్యూస్టుడే’కు చెప్పారు. తీర ప్రాంతాల్లో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కెరటాల ఉద్ధృతి అధికంగా ఉంటుందన్నారు. 15 వరకు చేపల వేట నిషేధించినట్లు చెప్పారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
శనివారం బాలేశ్వర్, భద్రక్, జాజ్పూర్, కేంద్రపడ, జగత్సింగ్పూర్, కటక్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నందున ‘ఆరెంజ్’ హెచ్చరికలు, సుందర్గఢ్, ఢెంకనాల్, అనుగుల్, ఝార్సుగుడ, పూరీ, ఖుర్ధా, కేంఝర్, దేవ్గఢ్, సంబల్పూర్, గంజాం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామని దాస్ తెలిపారు.
ఉత్తరకోస్తాలో నదులు ప్రమాదస్థాయికి
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరకోస్తాలో ప్రవహిస్తున్న నదులు, ఉపనదులు ప్రమాదస్థాయికి చేరువలో ఉన్నట్లు జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీరు బిజయ్కుమార్ మిశ్ర శుక్రవారం విలేకరులకు చెప్పారు. పరిస్థితిపై నిఘా ఉంచామని, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. బాలేశ్వర్ వద్ద వైతరణి, జలకా, సాలంది, బుఢా బొలంగ నదులు ప్రమాదస్థాయికి చేరువలో ఉన్నాయి. కేంఝర్ జిల్లా అఖువాపద వద్ద వైతరణి ప్రమాద స్థాయి 17.68 మీటర్లు కాగా, ఇక్కడ జల ప్రవాహం 17.58 మీటర్లుగా ఉంది. సంబల్పూర్ (బుర్లా) వద్ద హిరాకుడ్ జలాశయంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నీటి మట్టం 617.17 అడుగులుగా ఉంది. ఈ జలాశయం సామర్థ్యం 630 అడుగులు ఎగువ ప్రాంతం నుంచి సెకనుకి 2.90 లక్షల క్యూసెక్కులు నీరు హిరాకుడ్లో ప్రవేశిస్తోంది. ప్రత్యేక రిలీఫ్ కమిషనర్ ప్రదీప్కుమార్ జెనా అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. నదీ పరివాహక గ్రామాల్లోని పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచారు. వరదలు అనివార్యమైతే ప్రజల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గజపతి సేవలు చిరస్మరణీయం: నవీన్
[ 27-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహారాజా కృష్ణచంద్ర గజపతి సేవలు చిరస్మరణీయమని, రాష్ట్ర ప్రజలకు ఆయన మార్గదర్శిగా నిలిచారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభివర్ణించారు. -
కాంగ్రెస్కు పూర్వవైభవం దక్కేనా
[ 27-04-2024]
కొరాపుట్ జిల్లాలోని అయిదు నియోజకవర్గాలు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేవి. ఆ పార్టీలో నెలకొన్న వివాదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకువస్తున్నాయి. -
హింజిలికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి
[ 27-04-2024]
‘ముఖ్యమంత్రిగా 25 ఏళ్ల కాలంలో మీ సొంత నియోజకవర్గం హింజిలికి ఏం చేశారు?.. వలసలు నివారించడానికి అక్కడ పరిశ్రమలు ఏవైనా ప్రారంభించగలిగారా? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని నవీన్కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సవాల్ విసిరారు. -
ధర్మేంద్ర మాతృభూమికి చేసిందేమిటి?
[ 27-04-2024]
స్థిరమైన పాలన అందించిన ఘనచరిత్ర ముఖ్యమంత్రి నవీన్ సొంతమని, ఉత్తమ పాలకునిగా మన్ననలందుకున్నారని, అన్ని రికార్డులు ఆయన సొంతమని సంబల్పూర్ లోక్సభ బిజద అభ్యర్థి ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి) పేర్కొన్నారు. -
5 లోక్సభ, 35 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్
[ 27-04-2024]
రాష్ట్రంలో రెండోవిడతగా మే 20న జరగనున్న అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. -
రాయగడ జిల్లాలో 62 నామినేషన్లు
[ 27-04-2024]
జిల్లాలో రాయగడ, గుణుపురం, బిసంకటక్ నియోజకవర్గ శాసనసభ స్థానాలకుగాను ప్రధాన పార్టీలతోసహా ఇతర పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులతో కలిపి 62 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు శుక్రవారం ఆర్వో సంఘమిత్రా దేవి వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
[ 27-04-2024]
కేంద్ర హోంమంత్రి, భాజపా సిద్ధాంతకర్త అమిత్షా రాష్ట్ర పర్యటన పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గురువారం సాయంత్రం పశ్చిమ ఒడిశాలోని సోన్పూర్ బహిరంగ సభలో నవీన్ పట్నాయక్ పాలనా వైఫల్యాలను విమర్శించిన షా తాము బిజదకు అనుకూలం కాదన్న సందేశమిచ్చారు. -
నాడు బిజద.. నేడు భాజపా
[ 27-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో కొందరు నిన్నటి వరకు బిజూ జనతా దళ్లో ఉండి ఎన్నికల ముందు భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. -
బిజదలో చేరికలు
[ 27-04-2024]
బ్రహ్మపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఈఎంసీ) అయిదో వార్డుకు చెందిన యువ నాయకుడు సనాతన సాహు శుక్రవారం రాత్రి బిజదలో చేరారు. అంతకుముందు ఆయన వందలాది మంది వార్డు ప్రజలు, మద్దతుదారులతో కలిసి వార్డులో పాదయాత్ర నిర్వహించారు.