పాఠశాల విద్య ప్రశ్నార్థకమే
రాష్ట్రంలో విద్యార్థులకు పాఠశాల విద్య ప్రశ్నార్థకంగా మారుతోంది. మంచి భవితకు పునాది పడాల్సిన ప్రాథమిక విద్య అందని ద్రాక్షలా మిగులుతోంది.
11 వేలకు పైగా బడులకు విద్యుత్తు కరవు
మౌలిక వసతులు అంతంతమాత్రమే
రేకుల షెడ్డులో నిర్వహిస్తున్న తరగతి గది
రాయగడ పట్టణం, న్యూస్టుడే: రాష్ట్రంలో విద్యార్థులకు పాఠశాల విద్య ప్రశ్నార్థకంగా మారుతోంది. మంచి భవితకు పునాది పడాల్సిన ప్రాథమిక విద్య అందని ద్రాక్షలా మిగులుతోంది. రాష్ట్రంలో 11 వేలకుపైగా పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం లేకపోవడం పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతోంది. రాష్ట్రంలో 6 వేలకు పైగా పాఠశాలలకు సరైన తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. శాసనసభ సమావేశాల సందర్భంగా భాజపా చీఫ్ విప్ మోహన్ చరణ్ మాఝి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ విద్యాశాఖ మంత్రి సమీర్రంజన్ దాస్ వెల్లడించిన వివరాల్లో కింది అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో విద్యుత్తు సౌకర్యం లేకుండా 11,710 పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరీ పాఠశాలలు సైతం ఉండడం గమనార్హం. వీటిలో 6,781 పాఠశాలలో సరైన తరగతి గదులు లేకపోగా, మరో 6,011 పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి అనుగుణంగా లేకుండానే నడుస్తున్నాయి. క్రీడల అభివృద్ధికి రూ.కోట్లు వెచ్చిస్తున్నట్లు సర్కార్ గొప్పలు చెప్పుకుంటున్నా ఇప్పటికే 21,065 బడులకు క్రీడా మైదానాలు లేకపోవడం బాధాకరం.
సెకండరీ స్థాయిలో 27.26 శాతం డ్రాపౌట్లు
2021-22 విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో సున్నాగా నమోదైన డ్రాపౌట్లు, సెకండరీ విద్య స్థాయిలో 27.26 శాతంగా ఉన్నట్లు మంత్రి నివేదిక వెల్లడించింది. అదే ప్రాథమికోన్నత స్థాయి విషయానికొస్తే డ్రాపౌట్ల శాతం 7.32గా నమోదైనట్లు నివేదిక పేర్కొంది. అదే విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో స్థూల ప్రవేశాల నిష్పత్తి 100:32 కాగా, ప్రాథమికోన్నత స్థాయిలో 92:90, సెకండరీ స్థాయిలో 80:36గా ఉన్నట్లు నివేదిక బహిర్గతం చేసింది. ఈ సమస్యలపై సభలో మంత్రి దాస్ వివరణ ఇస్తూ.. పాఠశాలలో మౌలిక వసతుల సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందు ప్రాతిపదనలు ఉంచుతామన్నారు. ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) 2023-24లో ప్రాజెక్టులకు సంబంధించి ఆమోదిస్తే తదుపరి సర్కార్ ఆ దిశగా కార్యాచరణ రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఉపాధ్యాయుల భర్తీ అంశాన్ని మంత్రి ప్రస్తావిస్తూ ఎనిమిదేళ్లలో 19,490మంది శిక్ష సహాయకులను ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో నియమించినట్లు తెలిపారు. వీరిలో 2014-15లో 9,539 మందిని నియమించగా, 2016-17 ఆర్థిక సంవత్సరంలో మిగతా 9951 మంది ఉపాధ్యాయులను నియమించినట్లు ఆయన స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గజపతి సేవలు చిరస్మరణీయం: నవీన్
[ 27-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహారాజా కృష్ణచంద్ర గజపతి సేవలు చిరస్మరణీయమని, రాష్ట్ర ప్రజలకు ఆయన మార్గదర్శిగా నిలిచారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభివర్ణించారు. -
కాంగ్రెస్కు పూర్వవైభవం దక్కేనా
[ 27-04-2024]
కొరాపుట్ జిల్లాలోని అయిదు నియోజకవర్గాలు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేవి. ఆ పార్టీలో నెలకొన్న వివాదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకువస్తున్నాయి. -
హింజిలికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి
[ 27-04-2024]
‘ముఖ్యమంత్రిగా 25 ఏళ్ల కాలంలో మీ సొంత నియోజకవర్గం హింజిలికి ఏం చేశారు?.. వలసలు నివారించడానికి అక్కడ పరిశ్రమలు ఏవైనా ప్రారంభించగలిగారా? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని నవీన్కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సవాల్ విసిరారు. -
ధర్మేంద్ర మాతృభూమికి చేసిందేమిటి?
[ 27-04-2024]
స్థిరమైన పాలన అందించిన ఘనచరిత్ర ముఖ్యమంత్రి నవీన్ సొంతమని, ఉత్తమ పాలకునిగా మన్ననలందుకున్నారని, అన్ని రికార్డులు ఆయన సొంతమని సంబల్పూర్ లోక్సభ బిజద అభ్యర్థి ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి) పేర్కొన్నారు. -
5 లోక్సభ, 35 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్
[ 27-04-2024]
రాష్ట్రంలో రెండోవిడతగా మే 20న జరగనున్న అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. -
రాయగడ జిల్లాలో 62 నామినేషన్లు
[ 27-04-2024]
జిల్లాలో రాయగడ, గుణుపురం, బిసంకటక్ నియోజకవర్గ శాసనసభ స్థానాలకుగాను ప్రధాన పార్టీలతోసహా ఇతర పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులతో కలిపి 62 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు శుక్రవారం ఆర్వో సంఘమిత్రా దేవి వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
[ 27-04-2024]
కేంద్ర హోంమంత్రి, భాజపా సిద్ధాంతకర్త అమిత్షా రాష్ట్ర పర్యటన పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గురువారం సాయంత్రం పశ్చిమ ఒడిశాలోని సోన్పూర్ బహిరంగ సభలో నవీన్ పట్నాయక్ పాలనా వైఫల్యాలను విమర్శించిన షా తాము బిజదకు అనుకూలం కాదన్న సందేశమిచ్చారు. -
నాడు బిజద.. నేడు భాజపా
[ 27-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో కొందరు నిన్నటి వరకు బిజూ జనతా దళ్లో ఉండి ఎన్నికల ముందు భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. -
బిజదలో చేరికలు
[ 27-04-2024]
బ్రహ్మపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఈఎంసీ) అయిదో వార్డుకు చెందిన యువ నాయకుడు సనాతన సాహు శుక్రవారం రాత్రి బిజదలో చేరారు. అంతకుముందు ఆయన వందలాది మంది వార్డు ప్రజలు, మద్దతుదారులతో కలిసి వార్డులో పాదయాత్ర నిర్వహించారు.