అందరి కళ్లూ ‘హింజిలి’పైనే..
రాష్ట్రంలోని అందరి దృష్టి గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ‘హింజిలి’పైనే ఉంది.
నవీన్ ఆరోసారి పోటీకి దిగిన స్థానం
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: రాష్ట్రంలోని అందరి దృష్టి గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ‘హింజిలి’పైనే ఉంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరుసగా అయిదుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది అధికారపీఠాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆయన ఈ నియోజకవర్గం నుంచి ఆరోసారి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం రెండు దశాబ్దాలకుపైగా బిజద ఖాతాలో చేరింది. 1956 నుంచి 1990 వరకూ వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మధ్యలో ఒకసారి జనతాదళ్, ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 1997లో తండ్రి బిజు పట్నాయక్ మరణానంతరం నవీన్ పట్నాయక్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1997లో అస్కా లోక్సభ ఉప ఎన్నికలో ఆయన పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత తండ్రి పేరిట బిజు జనతాదళ్ (బిజద) ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసి పగ్గాలు చేపట్టి 2000 సంవత్సరంలో తొలిసారిగా హింజిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా అయిదుసార్లు ఈ నియోజకవర్గం ఓటర్లు ఆయనకు పట్టం కట్టారు.
పోటీలో ప్రత్యర్థులు
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇటీవల హింజిలి, శెరగడ సమితుల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయాచోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న నవీన్ హింజిలి, శెరగడ సమితులు దేశఖ్యాతి గాంచాయన్నారు. ప్రజలంతా మరోసారి శంఖాల గుర్తులపై ఓట్లేసి లోక్సభ, అసెంబ్లీ బిజద అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఈ నియోజకవర్గం నుంచి ఈసారి భాజపా అభ్యర్థిగా శిశిర్ మిశ్ర, కాంగ్రెస్ అభ్యర్థిగా రజనీకాంత్ పాఢి బరిలోకి దిగారు. వీరితోపాటు ఆప్, ఎస్యూసీఐ (కమ్యూనిస్టు) తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారన్నది త్వరలో తేలుతుంది. ఆరోసారి గెలుపొంది నవీన్ రికార్డు సాధిస్తారని బిజద నాయకులు దీమా వ్యక్తం చేస్తుండగా, దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పవనాలు వీస్తున్నాయని, ఆ ప్రభావం హింజిలిలో ఏ మేరకు ఉంటుందన్నది వేచి చూడాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తమ గెలుపు నిశ్చయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోయల్, దిలీప్ల మధ్య హోరాహోరీ
[ 18-05-2024]
కేంద్రమాజీ మంత్రి, సుందర్గఢ్ సిటింగ్ ఎంపీ జోయల్ ఓరంకు ఈసారి అగ్నిపరీక్ష ఎదురవుతోంది. -
రాష్ట్రంలో 15 ఎంపీ, 75 కు పైగా అసెంబ్లీ స్థానాలు మావే
[ 18-05-2024]
ఒడిశాలో ఈసారి 15 లోక్సభ, 75కుపైగా అసెంబ్లీ స్థానాల్లో భాజపా విజయం తథ్యమని, తమిళపాలనకిక తెరపడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా చెప్పారు. -
రత్నభాండాగారం తాళం చెవి పాండ్యన్ వద్ద ఉంది
[ 18-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పేదలందరికీ ఉచితంగా బియ్యం (రేషన్) ఇస్తున్నారని, ఒడిశా సీఎం నవీన్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు వట్టి గోనె సంచులిచ్చారని, ఈ సంచులు తమిళనాడులో తయారైనవని అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ ఎద్దేవా చేశారు. -
కుందిలిలో కృషి బజార్కు మోక్షమెప్పుడో
[ 18-05-2024]
కనీస సౌకర్యాల కరవు.. శిథిల భవనాలు, నిత్యం వెంటాడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు.. వినియోగానికి నోచుకోని బజార్.. ఇదీ కొరాపుట్ జిల్లాలోని కుందిలి వారపు సంతలో పంటలు విక్రయించేందుకు వచ్చిన అన్నదాతలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. -
19న రాష్ట్రానికి మోదీ
[ 18-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం (19న) రాత్రి 7 గంటలకు భువనేశ్వర్ రానున్నారు. -
గంజాం జిల్లాకు అదనపు కేంద్ర బలగాలు
[ 18-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కళ్లికోట అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగుకు ముందు చెలరేగిన రాజకీయ హింస నేపథ్యంలో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. -
నాలుగున్నర కోట్ల ప్రజలు నా ఊపిరి: నవీన్
[ 18-05-2024]
రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల ప్రజలు తన ఊపిరని, అందరి ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నానని, తన పాలనలో అన్ని వర్గాలవారికి న్యాయం జరిగిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. -
నవీన్జీ... మీకు 25 ఏళ్లు చాల్లేేదా?: ధర్మేంద్ర
[ 18-05-2024]
రాష్ట్రాన్ని 25 ఏళ్లు పాలించిన మీకు ఈ వ్యవధి చాలలేదా? సుదీర్ఘపాలనలో మీరు సాధించిందేమిటి?, ప్రజలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చగలిగారా? అంటూ సీఎం నవీన్ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు. -
రాష్ట్రంలో అన్నదాతలకు అన్యాయం: విష్ణుదేవ్
[ 18-05-2024]
నవీన్ పట్నాయక్ పాలనలో ఒడిశాలో అన్నదాతలకు అన్యాయం జరిగిందని, ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు (ఎంఎస్పీ) కల్పించడంలో విఫలమయ్యారని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయె అన్నారు. -
ముగ్గురు భాజపా నేతలపై వేటు
[ 18-05-2024]
-
నిందితుడ్ని తప్పించే యత్నం పోలీసు స్టేషన్లోకి చొరబాటు
[ 18-05-2024]
గంజాం జిల్లాలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే