logo

శాలినీ పండిత్‌కు మిషన్‌శక్తి బాధ్యతలు

రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శాలినీ పండిత్‌కు ప్రభుత్వం మిషన్‌శక్తి శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 05 May 2024 03:58 IST

శాలినీ పండిత్‌
భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శాలినీ పండిత్‌కు ప్రభుత్వం మిషన్‌శక్తి శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు మిషన్‌శక్తి బాధ్యతలు పర్యవేక్షించిన సుజాత కార్తికేయన్‌కు ఆర్థికశాఖ సహాయ కార్యదర్శిగా నియమించారు. బిజదకు సుజాత ఏజెంటులా పనిచేస్తున్నారన్న భాజపా ఫిర్యాదు మేరకు ఎన్నికల యంత్రాంగం మిషన్‌శక్తి బాధ్యతల నుంచి ఆమెను తప్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని