నవీన్ ఆధిపత్యానికి ఈ సారి అడ్డుకట్ట పడేనా?
గంజాం జిల్లాలో ముఖ్యమంత్రి నవీన్ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతుందా? ఈసారి ఎన్నికల్లో కమల వికాసం జరిగేనా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ బ్రహ్మపురకు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. భాజపాకు కలిసి వస్తుందని, బిజద దూకుడుకు పగ్గాలు పడతాయని భాజపా నేతలు ఆశాభావంతో ఉన్నారు.
గంజాం జిల్లాలో కమల వికాసం జరిగేనా?
నేడు బ్రహ్మపురకు ప్రధాని మోదీ రాక
గోపాలపూర్, న్యూస్టుడే
గంజాం జిల్లాలో ముఖ్యమంత్రి నవీన్ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతుందా? ఈసారి ఎన్నికల్లో కమల వికాసం జరిగేనా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ బ్రహ్మపురకు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. భాజపాకు కలిసి వస్తుందని, బిజద దూకుడుకు పగ్గాలు పడతాయని భాజపా నేతలు ఆశాభావంతో ఉన్నారు.
1996లో పీవీ వచ్చారు
1996లో నాటి ప్రధాని (దివంగత) పి.వి.నరసింహారావు గోపాల్పూర్ వచ్చారు. అప్పట్లో టాటా స్టీల్ ఉక్కు కర్మాగారం నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటును నిర్వాసితులు వ్యతిరేకించడంతో పనులు నిలిచిపోయాయి. స్థల సేకరణ జరిగినా పరిశ్రమ నిర్మాణం జాజ్పూర్ జిల్లా కళింగనగర్కు తరలిపోయింది. అనంతరం టాటా స్థలాలకు ప్రత్యేక ఆర్థిక జోన్ (సెజ్) హోదా దక్కింది. ఇతర పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరుగుతున్నాయి. పీవీ తర్వాత ప్రధాని హోదాలో మోదీ బ్రహ్మపుర వస్తున్నారు. ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించనున్న ఆయన రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా గుర్తింపు పొందిన గంజాం గురించి ఏం చెబుతారన్నదానిపై ప్రజలందరిలో ఉత్కంఠ ఉంది.
నీటి పారుదల అంతంత మాత్రం
బిజద హయాంలో ఏదీ ప్రగతి?
గంజాం జిల్లా అస్కా లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు ఎన్నికైన నవీన్ పట్నాయక్ అటల్బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో ఉక్కుగనుల శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 2000లో ఆయన గంజాం జిల్లా హింజిలి నుంచి అసెంబ్లీకి ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యారు. వరుసగా అయిదుసార్లు సీఎం అయిన నవీన్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చేసిందేమీ లేదన్న అసంతృప్తి జిల్లాలో ఉంది. యువతలో ఇది బలంగా ఉంది. ఉపాధి అవకాశాలు లేక ఈ జిల్లావాసులు వలస పోతున్నారు. సూరత్ (గుజరాత్)లో ఈ జిల్లాకు చెందిన ప్రజలు 3 లక్షల మంది ఉన్నారు. మరో రెండు లక్షల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న హింజిలిలో వలసలు ఎక్కువ. జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి బిజద తీసుకున్న చర్యలు కూడా లేవు. నదులు పుష్కలంగా ఉన్నా సాగునీటి కల్పన లేదు.
జిల్లా నుంచి వలసపోతున్న కార్మికులు
ఆదరిస్తున్న ఓటర్లు
నవీన్ హయాంలో జిల్లా ప్రగతి రథచక్రాలు పరుగులు తీస్తాయన్న ఆశలు పెంచుకున్న జిల్లా వాసులు బిజదను ప్రతిసారి ఎన్నికల్లో ఆదరిస్తున్నారు. 2019లో బ్రహ్మపుర, అస్కా లోక్సభ, వాటి పరిధుల్లోని 13 అసెంబ్లీ స్థానాల్లో బిజద అభ్యర్థులను గెలిపించారు. జిల్లా నుంచి ఎన్నికైన నవీన్ అయిదోసారి సీఎం కాగా బిక్రంకేసరి అరుఖ్, ఉషాదేవి, ప్రదీప్కుమార్ పాణిగ్రహి కేబినెట్ మంత్రులుగా విధులు నిర్వహించారు. గతసారి ఎన్నికల్లో భాజపా జిల్లాలో ఖాతా తెరవలేకపోయింది. ఈసారి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నెల 13, 20 తేదీల్లో బ్రహ్మపుర, అస్కా లోక్సభ, వాటి పరిధుల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ప్రచారానికి వస్తున్న ప్రధాని మోదీకి ఈ జిల్లా గురించి తెలుసు. అభివృద్ధికి అవకాశాలున్నా బిజద పాలకులు ఏమీ చేయలేకపోయారని తెలిసిన ఆయన ఎలా స్పందిస్తారు? ఓటర్లకు ఏం సందేశమిస్తారన్న దానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మార్పు తథ్యమంటున్న నేతలు
గంజాం జిల్లా భాజపా అధ్యక్షుడు సుభాష్సాహు ఆదివారం కొణిసిలో విలేకరులతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ పర్యటన పార్టీకి లాభిస్తుందని, ఓటరు చైతన్యానికి బాటలు పడతాయన్నారు. గోపాల్పూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు పొంచు బెహరా ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ... గంజాం జిల్లాలో మోదీ పవనాలు వీస్తున్నాయని, ఆయన గ్యారంటీని ప్రజలంతా విశ్వసిస్తున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 19-05-2024]
రాయగడ జిల్లా కాసిపూర్ సమితి పరిధిలో విద్యార్థుల మృతి ఘటనలకు సంబంధించి నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
పాతకక్షలతో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 19-05-2024]
పాతకక్షల నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
కమలమా.. శంఖమా ?
[ 19-05-2024]
పశ్చిమ ఒడిశాలోని బరగఢ్ లోక్సభ స్థానంలో ఎన్నికల వేడి పెరిగింది. భాజపా, బిజద అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోరు నువ్వా? నేనా? అన్న రీతిలో సాగుతోంది. -
రెండోవిడత ప్రచారానికి తెర
[ 19-05-2024]
అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లో 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం (20న) రెండోవిడత పోలింగ్ జరగనుంది -
చివరి రోజు ముమ్మరంగా ప్రచారం
[ 19-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు -
ఈసారి కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు: సచిన్ పైలెట్
[ 19-05-2024]
ఈసారి దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆ పార్టీ నేత సచిన్ పైలెట్ చెప్పారు. -
ప్రజాహితం కోరే సీఎం అవసరం: భజన్లాల్
[ 19-05-2024]
ఒడిశా ప్రజల హితం కోరే సీఎం రాష్ట్రానికి అవసరమని, నవీన్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ చెప్పారు. -
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి: అశ్వినీ
[ 19-05-2024]
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి తథ్యమని, ప్రధాని మోదీ హయాంలో భారత్ అన్ని రంగాల్లో ముందంజ వేసినట్లు రైల్వే, కమ్యూనికేషన్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. -
పంటను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే
[ 19-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేంతవరకు కాపాడుకోవాల్సిన బాధ్యత రైతన్నలదేనని సహకార సంఘం డిప్యూటీ డైరెక్టర్ మన్మధకుమార్ దాస్ అన్నారు. -
బిజద పక్షానే రాష్ట్ర ప్రజలు: సీఎం
[ 19-05-2024]
ఒడిశాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలపై ముఖ్యమంత్రి నవీన్ విమర్శలు గుప్పించారు. -
రాష్ట్రానికి మోదీ, రాజ్నాథ్, అమిత్షాల రాక
[ 19-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకోనున్నారు. 9 గంటలకు భాజపా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార వ్యూహం, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!